Tollywood : కరోనా ఆంక్షలు తొలగిపోయి థియేటర్లు ఓపెన్ అయిన తర్వాత నిర్మాతలంతా పోటీపడి సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. వరుసబెట్టి రిలీజ్ డేట్ లు ప్రకటించేశారు. గత శుక్రవారం ఒక్క రోజే నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అల్లరి నరేష్ ‘నాంది‘, అక్కినేని హీరో సుమంత్ ‘కపటధారి‘ తో పాటు విశాల్ సినిమా ‘చక్ర‘, కన్నడ డబ్బింగ్ ‘పొగరు‘ విడుదలయ్యాయి. అంతకు ముందు వారం వైష్ణన్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఉప్పెన’ మూడు రోజులకే బ్రేక్–ఈవెన్ సాధించింది. అయితే ఇప్పుడు అన్నీ సినిమాల భవిష్యత్తు ఈ వారంలోనే తేలనుంది.
ఈ శుక్రవారం విడుదలైన సినిమాలు అన్నింటిలో అల్లరి నరేష్ ‘నాంది‘ బాగా పర్ఫార్మ్ చేసింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు కలెక్షన్స్ రాబట్టిన ‘ఉప్పెన‘ సినిమా రెండవ వారం కూడా అదే హవా కొనసాగించింది. ముఖ్యంగా శని ఆదివారాల్లో అయితే హౌస్ఫుల్ బోర్డులు సాధించింది. ‘నాంది‘ ఓపెనింగ్స్ బావున్నాయి. అలాగే క్రైమ్ థ్రిల్లర్ ‘కపటధారి‘ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘పొగరు‘ కి కూడా ఒక మోస్తరు ఓపెనింగ్స్ లభించాయి.
అయితే సైబర్ క్రైమ్ నేపథ్యంలో వచ్చిన ‘చక్ర‘ మిగతా సినిమాల కంటే ఎక్కువ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పెన మినహాయించి ఈ వారం మిగతా నాలుగు సినిమాలు వేటికవే పడుతున్నాయి.
అయితే ఇప్పుడు ప్రతి చిత్రం ముందు ఒక్కొక్క టార్గెట్ వుంది. ఇప్పటికే 70 కోట్ల రూపాయలు వసూలు చేసిన ‘ఉప్పెన’ వంద కోట్ల క్లబ్ లో చేరుతుందో లేదో ఈ వారం కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే జనవరి 26 వ తేదీన మరిన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి. మిగిలిన సినిమాలు బ్రేక్ – ఈవెన్ సాధించాయా… హిట్ అయ్యాయా… లేక నష్టాలు మూటగట్టుకున్నాయా అన్నది ఈ వారం తేలిపోతుంది.