2016 లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రంతో తెరంగేట్రం చేసి కేవలం నాలుగేళ్లలోనే అసాధారణ స్టార్ డమ్ తో టాప్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మిక మందన్న. టాలీవుడ్ లో ఈ భామ వరుసగా టాప్ హీరోల సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. తెలుగు మరియు తమిళంలో బిజీ స్టార్ హీరోయిన్ గా మారింది ఈ కన్నడ ముద్దుగుమ్మ. రష్మిక ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా పుష్పలో నటిస్తున్నది. టాలీవుడ్ లో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ చూసి ఎన్టీఆర్ మరియు చరణ్ లాంటి స్టార్లు అవకాశాలివ్వనున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉండగా తెలుగు, తమిళ సినిమాలతో బిజీ గా ఉన్న ఈ బ్యూటీ కి అటు బాలీవుడ్ లోనూ సిద్ధార్థ్ మల్హోత్రా లాంటి క్రేజీ హీరో సరసన అవకాశం అందుకుంది. ఇప్పుడు ఏకంగా వికాస్ బహల్ దర్శకత్వం వహించనున్న ఆయన తదుపరి చిత్రం ‘స్లైస్ ఆఫ్ లైఫ్’ కామెడీ చిత్రంలో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే ఆఫర్ ను దక్కించుకుని హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలో రష్మిక మందన అమితాబ్ బచ్చన్ కి కూతురిగా నటించనున్నది. ఈ చిత్రం తండ్రి-కూతుర్ల ఎమోషనల్ బాండ్ కి సంబంధించిన కథతో తెరకెక్కనున్నది.
రిలయన్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మించనున్నది మరియు తాత్కాలికంగా ఈ సినిమాకు `డెడ్లీ` అనే టైటిల్ ని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ మార్చి 2021 లో చిత్రీకరణకు వెళ్లనున్నది.
ఇప్పటికే రష్మిక, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న `మిషన్ మజ్ను` చిత్రంతో నటించేందుకు సైన్ చేసింది. బాలీవుడ్ లోకి రష్మిక ఈ సినిమాతో అడుగుపెట్టనున్నది. ఆ వెంటనే బిగ్ బి సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?