Tollywood stars: బిగ్ బాస్ రియాలిటీ షో ముందు హాలీవుడ్లో మొదలైన షో. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని స్టార్ మా హిందీలో ప్లాన్ చేసింది. బాలీవుడ్లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్గా బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ మొదలు పెట్టారు. ఈ షో అక్కడ భారీ స్థాయిలో సక్సెస్ అయింది. ప్రతీ ఏడాది సరికొత్త హంగులతో ఈ రియాలిటీ షో టెలికాస్ట్ అవుతోంది. దీనికి సల్మాన్ భారీ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. సల్మాన్ బుల్లితెర మీద చేస్తున్న సందడి అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. అలాగే బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్ట్గా కౌన్ బనేగా కరోడ్ పతి రియాలిటీ షో అద్భుతంగా సాగుతోంది.
సినీ సెలబ్రిటీలతో పాటు సామాన్య కంటెస్టెంట్స్ షోలో పాల్గొని మంచి అమౌంట్ గెలుచుకుంటున్నారు. నాలెడ్జ్తో పాటు కోటీశ్వరులను చేసే ఈ షో యావత్ భారతదేశం మొత్తం ఆకట్టుకుంటోంది. దాంతో ఈ రెండు షోలను తెలుగులో ప్లాన్ చేశారు. మీలో ఎవరు కోటీశ్వరులు అంటూ మొదట మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా ప్రారంభించారు. ఆ తర్వాత ఇదే షోను నాగార్జున హోస్ట్గా ఓ సీజన్ నడిపారు. అయితే బిగ్ బాస్ కూడా మొదలు పెట్టడంతో స్టార్ మా వారు మీలో ఎవరు కోటీశ్వరులు షోను ఆపేశారు.
Tollywood stars: ఇలా గెలుచుకుంటున్న డబ్బును సోషల్ సర్వీస్కి ఉపయోగించుకుంటున్నారు.
దాంతో ఇప్పుడు ఈ షోను పేరు మార్చి ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ సన్ నెట్వర్క్ వారు ఈ ఏడాది యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్గా ప్రసారం చేస్తున్నారు. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్.టి.ఆర్ హోస్ట్ చేసి అద్భుతంగా నడిపాడు. ఆ తర్వాత నాని..ఆ తర్వాత నుంచి నాగార్జున హోస్ట్గా ఈ షో రన్ అవుతోంది. తమిళంలో కూడా బిగ్ బాస్ 5వ సీజన్ సాగుతోంది. దీనికి లోకనాయకుడు కమల్ హాసన్ హోస్ట్గా వ్యవహరిస్తున్నాడు. బిగ్ బాస్ ఈ మూడు భాషలలోనూ సక్సెస్ ఫుల్గా రన్ అవుతోంది.
ప్రస్తుతం తెలుగులో స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్ అలాగే జెమినీ వారు ప్రసారం చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు పోటా పోటీగా సాగుతున్నాయి. బిగ్ బాస్ కంటే కూడా ఎవరు మీలో కోటీశ్వరులు మంచి టీఆర్పీ రేటింగ్తో సాగుతోంది. రామ్ చరణ్, అగ్ర దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, సూపర్ స్టార్ మహేశ్ బాబు, సమంత, తమన్నా..ఇలా స్టార్స్ అందరూ ఎవరు మీలో కోటీశ్వరులో పాల్గొని కనీసం 25 లక్షల వరకు గెలుచుకుంటున్నారు. ఇలా గెలుచుకుంటున్న డబ్బును సోషల్ సర్వీస్కి ఉపయోగించుకుంటున్నారు.
Tollywood stars: చిరు గెస్ట్గా తన షోకి రాబోతున్నట్టు స్వయంగా బాలయ్య వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
ఇదే క్రమంలో స్టార్ మేకర్ అల్లు అరవింద్ ఆహా ఓటీటీలోనూ టాక్ షోస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పటికే సమంతతో టాక్ షో ప్రసారం చేసిన ఆహా నిర్వాహకులు త్వరలో నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్గా ఓ షో మొదలు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఈ షో షూటింగ్ కూడా ప్రారంభమయింది. అంతేకాదు బాలయ్య – మెగాస్టార్ మధ్య గతకొంతకాలంగా అంత సఖ్యత లేదు. అలాంటిది అల్లు అరవింద్ ఈ షోతో ఇద్దరినీ కలుపుతుండటం విశేషం. చిరు గెస్ట్గా తన షోకి రాబోతున్నట్టు స్వయంగా బాలయ్య వెల్లడించడం ఆసక్తికరంగా మారింది. మొత్తానికి మన టాలీవుడ్ స్టార్స్ ఓటీటీ ప్లాట్ ఫాంస్లో స్మాల్ స్క్రీన్పై బాగా సందడి చేస్తున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు.