Tollywood Stars: మన టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లు సినిమాల ద్వారా సంపాదిస్తున్నదంతా దాచుకోవడం లేదు. వేరే వేరే బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో ఓ సినిమా భారీ హిట్ అయితే ఆ తర్వాత వచ్చే సినిమాల రెమ్యునరేషన్తో సిటీలో..అవుట్ స్కట్స్లో ల్యాండ్స్, విలాస్, అపార్ట్ మెంట్స్లో ఖరీదైన ఫ్లాట్స్..విలేజస్లో ఫాం హౌజెస్, తోటలు..ఇలా ప్రాపర్టీస్ కొనుగోలు చేసి ఆ సంపాదనను పెంచుకునేవారు. పూరి లాంటి దర్శకులు సంపాదించినదంతా పోగొట్టుకున్నాక తనకున్న ప్రాపర్టీస్ అమ్మేసి అప్పులు కట్టుకున్నాడు. మళ్ళీ తను కష్టపడి సంపాదించుకున్నాడు.
ఇక మన హీరోలలో ఎక్కువగా అందరూ థియేటర్స్ బిజినెస్లోకి దిగుతున్నారు. సినిమా అనేది పెద్ద వినోదం. ఇది ఎప్పటికీ ఉంటుంది. అందుకే మల్టీప్లెక్స్ బిజినెస్లో దిగి కొత్త హంగులతో థియేటర్స్ను ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ బిజినెస్లోకి ముందుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు దిగాడు. బ్రహ్మోత్సవం సినిమా సమయంలో సొంత నిర్మాణ సంస్థను తన పేరు మీదే స్టార్ట్ చేశాడు. ఘట్టమనేని మహేశ్ బాబు పేరులోని అక్షరాలను హైలెట్ చేస్తూ జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి తాను నటించే సినిమాలకి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.
Tollywood Stars: జీఎంబీ మల్టీప్లెక్స్ కూడా మొదలు పెట్టి ప్రధాన నగరాలలో చైన్ బిజినెస్ రన్ చేస్తున్నాడు.
అంతేకాదు అడవి శేష్ లాంటి యంగ్ హీరోలను ఎంకరేజ్ చేస్తూ పాన్ ఇండియన్ రేంజ్ సినిమాలను నిర్మిస్తున్నాడు. అలాగే జీఎంబీ మల్టీప్లెక్స్ కూడా మొదలు పెట్టి ప్రధాన నగరాలలో చైన్ బిజినెస్ రన్ చేస్తున్నాడు. ఇలా థియేటర్స్ బిజినెస్లో మహేశ్ తర్వాత మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కూడా దిగాడు. వి ఎపిక్ అనే మల్టీప్లెక్స్ను నెల్లూరులో మొదలు పెట్టాడు. ఇప్పటికే వీరి మల్టీప్లెక్స్లో సినిమాలు ప్రదర్శింపబడుతున్నాయి. వీరి బాటలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా
మల్టీప్లెక్స్ బిజినెస్లో దిగాడు.
హైదరాబాద్ అమీర్ పేట్లో సత్యం థియేటర్ ఉన్న ప్లేస్ లో ఇప్పుడు ఏషియల్ వారితో కలిసి ఎ.ఎ.ఎ అనే మల్టీప్లెక్స్ ప్రారంభించబోతున్నాడు. ఏషియన్ అల్లు అర్జున్ అనే మల్టీప్లెక్స్ హైదరాబాద్ తో పాటు బెంగళూర్ వంటీ ప్రధాన నగరాలలో ప్లాన్ చేస్తున్నాడు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఇటీవల ఏవిడి మల్టీప్లెక్స్ తన సొంతరూరైన మహబూబ్ నగర్ లో మొదలు పెట్టారు. ఇటీవల వాళ్ళ అమ్మగారి బర్త్ డే కానుకగా ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ను బహుమతిగా ఇచ్చాడు విజయ్ దేవరకొండ. ఇలా టాలీవుడ్
స్టార్స్ మల్టీప్లెక్స్ బిజినెస్లో ఓ రకంగా సేఫ్ సైడ్ బిజినెస్గానే ఎంటరవుతున్నారట.
Tollywood Stars: సమంత మింత్ర, సాకీ అనే బ్రాండ్ క్లాత్ బిజినెస్లో దూసుకుపోతోంది.
వీరే కాదు యంగ్ హీరో సందీప్ కిషన్ వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ మొదలు పెట్టాడు. హీరోయిన్ రకుల్ ప్రీత్కి హైదరాబాద్, బెంగళూరులో ఫిట్నెస్ సెంటర్స్ ఉన్నాయి. సమంత మింత్ర, సాకీ అనే బ్రాండ్ క్లాత్ బిజినెస్లో దూసుకుపోతోంది. విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ మాత్రమే కాకుండా రౌడీ బ్రాండ్ అనే బట్టల వ్యాపారం కూడా దూసుకుపోతున్నాడు. యూత్ అందరిలో ఈ బ్రాండ్కి మంచి క్రేజ్ ఉంది. ఇలా టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ వారి సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఇలా మరో కొత్త వ్యాపారంలో పెట్టి కొత్త బిజినెస్లలో బాగానే సంపాదిస్తున్నారు.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!