Tollywood: కరోనా వైరస్ తీసుకువచ్చిన కష్టాలకు టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతలు, హీరోలు, హీరోయిన్ లకి అదే రీతిలో సినీ కార్మికులకు పని లేకుండా పోయిన సంగతి తెలిసిందే. వైరస్ ని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలవల్ల షూటింగులు మొన్నటివరకు ఆగిపోవటం జరిగింది. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం మరో పక్క సెకండ్ వేవ్ తీవ్రత తగ్గిపోవటంతో.. పాటు చాలావరకు వైరస్ కంట్రోల్ లోకి రావడంతో.. ఇప్పుడిప్పుడే షూటింగ్ స్టార్ట్ అవుతున్నాయి.
పరిస్థితి ఇలా ఉండగా ఇండస్ట్రీలో ఒకేసారి నాలుగు సినిమాలు చేయటానికి ఓ యంగ్ హీరో రెడీ అయిపోయాడు. కరోనా తీసుకొచ్చిన గ్యాప్.. ఒకేసారి పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఈ యంగ్ హీరో డిసైడ్ అయినట్లు అందుకోసం తాజాగా నాలుగు సినిమాలు ఒకేసారి చేసి అభిమానులను సినీ ప్రేక్షకులను అలరించాలని డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Read more: Tollywood: ప్లాప్ హీరోయిన్ కి 3 కోట్లు.. ఏ సినిమా యో అని కన్ఫ్యూజన్ లో అభిమానులు..??
ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు నాగ శౌర్య. ఊహలు గుసగుసలాడే ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ యంగ్ హీరో చేలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకని.. ఇండస్ట్రీలో తనకంటూ సపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా అశ్వత్థామతో తనలో ఉన్న స్టోరీ రైటర్ ని కూడా.. బయటకు తీసిన నాగశౌర్య ఆ సినిమా కోసం అనేక రీతులుగా కష్టపడి.. బాడీ షేప్ మొత్తం మార్చుకుని హిట్ కొట్టి బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మూడు సినిమాలతో పాటు ఊహలు గుసగుసలాడే వంటి సూపర్హిట్స్ ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తో పాపా అనే టైటిల్ కలిగిన సినిమా సౌర్య చేస్తున్నాడట. ఈ సినిమా తన కెరీర్లో చాలా డిఫరెంట్ అని తన చనిపోయిన తరువాత కూడా కచ్చితంగా ఈ సినిమా గురించి చెప్పుకుంటారని.., అంతలా సినిమాలో తన క్యారెక్టర్ ఉంటుందని.. ఈ సినిమా చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నారు నాగ శౌర్య రీసెంట్ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఒకేసారి ప్రస్తుతం నాలుగు సినిమాల షూటింగులు చేస్తున్నట్లు స్పష్టం చేశాడు.