Tollywood: గత ఏడాది నుంచి కరోనా పంజా విసురుతూనే ఉంది. వేవ్ వచ్చిన ప్రతీసారి వేలల్లో ప్రాణ నష్ఠం కోట్లలో ఆర్ధిక నష్ఠం వాటిల్లుతోంది. ఫస్ట్ వేవ్ దెబ్బకే ఇంకా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కోలుకోలేదు. ఇప్పుడు చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలెన్ని వస్తున్నాయో..100 కోట్ల నుంచి ప్రభాస్ నటిస్తున్న 300 నుంచి 500 కోట్ల పాన్ ఇండియన్ సినిమాల వరకు అన్నే సినిమాలొస్తున్నాయి. ఇప్పటికే కరోనా వల్ల ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, ఆచార్య, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట, హరిహర వీరమల్లు, సలార్, ఆదిపురుష్, పుష్ప ఇలా భారీ బడ్జెట్ సినిమాలన్నీ సంవత్సరం పైగానే షూటింగ్ దశలో ఆగిపోయాయి.
మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టి కొన్నాళ్ళు అవగానే సెకండ్ వేవ్తో దెబ్బపడింది. మళ్ళీ పరిస్థితులు సద్దుమణిగాయని అన్నీ సినిమాల రిలీజ్ డేట్ లాక్ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటే థర్డ్ వేవ్ అంటూ ఓమైక్రాన్ రూపంలో మళ్ళీ కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ భారత్లోకి ఎంటరైందని నిపుణులు వెల్లడించారు. దీంతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వారికి భయం పట్టుకుంది. మళ్ళీ దీని ప్రభావం ఎన్ని నెలలు ఉంటుందో..జనాలు థియేటర్స్కు రాకపోతే పరిస్థితేంటి అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఒకవైపు ఏపీలో టికెట్ రేట్స్ విషయంలో ప్రభుత్వం షాకిచ్చింది.
Tollywood: ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇప్పుడు ఓమైక్రాన్ ఎఫెక్ట్ పడనుందని అంటున్నారు. దాంతో రెండు సినిమాల రిలీజ్ను వాయిదా వేయనున్నారని టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అన్నీ సౌత్ భాషలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. అదే రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ‘గని’ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడయ్యారు. కానీ ఇప్పుడు ఓమైక్రాన్ వేగంగా వ్యాపిస్తున్న కారణంగా వచ్చే ఏడాది మార్చ్ నెలకు వాయిదా వేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు కొత్తగా టాక్ వినిపిస్తోంది. దీనిపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా మేకర్స్ నుంచి రానప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఒక్క గని సినిమా మాత్రమే వాయిదా పడి నాని శ్యామ్మ్ సింగ రాయ్ సినిమా మాత్రం అనుకున్న తేదీకే రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.