ఈ భూమ్మీద ఎంతో ముఖ్యమైన వస్తువులలో నీరు ఎంతో విలువైనది. సకల ప్రాణులకు దాహాన్ని తీరుస్తూ ప్రాణదాతగా నిలుస్తోంది. ఎంతో మందికీ జీవనాధారంగా నిలుస్తూ కోట్లాదిమంది ప్రజలను కాపాడుతోంది ఈ నీరు. అలాగే మనిషి శరీరానికి కూడా నీరు ఎంతో ముఖ్యమైనది. మానవ శరీరంలో సుమారు 60 నుంచి 70 శాతం నీటిని కలిగుంటుంది. తగినన్ని మోతాదులో నీరు తీసుకోవడం మూలంగా మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు. నీటిని తాగడం మూలంగా ఎంతో ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందుతారని నిపుణులు కూడా ప్రజలకు అవగాహణ కల్పిస్తుంటారు.
చల్లని నీటిని కాకుండా గోరువెచ్చని నీటిని తాగటం మరీ మంచిదని వైద్యులు, నిపుణులు తెలుపుతున్నారు. కాగా నీటి మూలంగా మానవశరీరానికి ఎన్నో రకాల ఉపయోగాలున్నాయి. నీటిని శరీరానికి తగినన్ని మోతాదులో తీసుకుంటే జుట్టు ఆరోగ్యంవంతంగానూ, శరీరం మెరిసిపోవడానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ప్రతి రోజూ ఉదయం గోరువెచ్చని నీటిని తీసుకోవడం మూలంగా శరీరంలో పేరుకుపోయిన మలినాలు బయటకు వస్తాయి.
దీనితో పాటుగా అధిక బరువుతో బాధపడే వారికి నీరును తాగడం మూలంగా ఉపశమనం లభిస్తుంది. కాగా చర్మ రోగాలతో బాధపడేవారికి నీరు చక్కటి మందులా పనిచేస్తుంది. శరీరంరో 75 నుంచి80 శాతం నీరుంటే ఎటువంటి చర్మవ్యాధులు, తొందరగా చర్మంపై ముడతలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. కాగా మలబద్దకాన్ని తొలగించడంలో నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
కాగా నీరును తీసుకోవడం మూలంగా ఎన్నో ఉపయోగాలున్నాయన్న సంగతి పక్కన పెడితే నీరు నుంచి కూడా సమస్యలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తగినన్ని మోతాదులో కాకుండా అధికంగా నీటిని తీసుకోవడం మూలంగా అనేక రోగాల భారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. మరీ ముఖ్యంగా కిడ్నీల సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలు ఎదురుకావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటిని తగినన్ని మోతాదులో తీసుకుంటూ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.