మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పక్క హీరోగా చేస్తూనే మరో పక్క నిర్మాతగా కూడా చరణ్ కెరియర్ కొనసాగిస్తున్నారు. కాగా రామ్ చరణ్ ఉపాసన అనే అమ్మాయిని ప్రేమ పెళ్లి చేసుకోవడం జరిగింది. అటువంటి చెర్రీని మళ్లీ పెళ్లి చేసుకుంటానని టాప్ యాంకర్ ఇటీవల తెలియజేయటం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి మేటర్ లోకి వెళ్తే స్టార్ యాంకర్ శ్రీముఖి లాక్ డౌన్ తర్వాత యూట్యూబ్ ఛానల్ తనకంటూ సపరేట్ గా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన సొంత ఛానల్ లో స్టార్టింగ్ లో ఉమెనియా అనే ప్రోగ్రామ్ పేరిట మొట్ట మొదటి ఎపిసోడ్ యాంకర్ సుమ తో ఇంటర్వ్యూ చేయగా తాజాగా మరో టాప్ యాంకర్ అనసూయ భరద్వాజ్ తో ఇంటర్వ్యూ చేసింది.
తాజాగా రిలీజ్ అయిన ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో వేడివేడి డైలాగుల వేసింది అనసూయ. ఇంటర్వ్యూ లో భాగంగా శ్రీముఖి కిల్ మ్యారీ హుక్ అప్ క్వశ్చన్ వేసింది.అంతేకాకుండా మూడు ఆప్షన్స్ ఇచ్చింది. నాగార్జున, సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్.దీనికి అనసూయ జవాబిస్తూ హుక్ అప్ నాగార్జునతో అని, సాయి ధరమ్ తేజ్ను చంపేస్తానని చెప్పుకొచ్చింది. తన రంగస్థలం చిట్టిబాబును రామ్ చరణ్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. రంగస్థలం సినిమా లో అనసూయ రంగమ్మత్త పాత్ర లో నటించి చెర్రీ కి బాగా క్లోజ్ అవ్వటం జరిగింది. బాగా సన్నిహితంగా, చెర్రీ తో మంచి స్నేహం ఉండటంతో ఇంటర్వ్యూలో భాగంగా కిల్ మ్యారీ హుకప్లో మ్యారేజ్ ఎంచుకుంది ఈ టాప్ యాంకర్ అనసూయ.