ఢిల్లీ, ఫిబ్రవరి 13: రఫేల్ ఫైటర్ జెట్ డీల్పై కాంగ్రెస్ అగ్రనేతలు బుధవారం పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
యుపిఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీల ఆధ్వర్యంలో పార్టీ నేతలు పేపర్ విమానాలను గాల్లోకి విసిరివేసి నిరసన తెలియజేశారు.
ఈ పేపరు విమానాలపై మోది, అనిల్ అంబానీల చిత్రాలను అతికించారు. మోది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
రఫేల్ అంశానికి సంబంధించి కాగ్ రిపోర్టు పార్లమెంట్ ముందుకు రానున్న నేపథ్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని కాంగ్రెస్ చేపట్టింది.
ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ కాగ్ రిపోర్టు తీసి పారేశారు, కాగ్ రిపోర్టును ‘చౌకీదార్ (కాపలాదారుడు) ఆడిటర్ జనరల్’ రిపోర్టుగా అభివర్ణించారు.
నిరసన కార్యక్రమంలో పార్టీ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు.