ఢిల్లీ, ఫిబ్రవరి 8 : బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లక్నో, నోయిడాలో పార్టీ ఎన్నికల గుర్తు ఏనుగు విగ్రహాలకు ఖర్చు పెట్టిన ప్రజా ధనాన్ని డిపాజిట్ చేయాలని నేడు సుప్రీం కోర్టు ఆదేశించింది.
రాజకీయ పార్టీలు వారి వ్యక్తిగత ప్రచారానికి ప్రజల (ప్రభుత్వ) సొమ్ము ఖర్చు చేయడాన్ని ప్రశ్నిస్తూ ఒక న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది.
విగ్రహాలకు ఖర్చు చేసిన నగదును మాయావతి డిపాటిజ్ చేయాలని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఆదేశించారు.
జస్టిస్ దీపక్ గుప్తా, సంజీవ్ ఖన్నాల నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ రెండున ఈ కేసు విచారణ చేయనుంది.
ఏప్రిల్ రెండునే విచారణ ముగించడం జరుగుతుందని సుప్రీం కోర్టు పేర్కొన్నది.
సార్వత్రిక ఎన్నికల అనంతరం వచ్చేట్లు మే నెలకు కేసు వాయిదా వేయాలని బిఎస్పి న్యాయవాది సతీష్ మిశ్రా కోర్టును అభ్యర్థించారు.