బాలీవుడ్ సీనియర్ బాచిలర్స్ లో ఒకరయిన రణబీర్ కపూర్ మీద సంవత్సరాల పాటు రకరకాల ఊహాగానాలు వినిపించాయి. చివరకు రణబీర్ కపూర్ తన ప్రియురాలు అలియా భట్ ని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. దేశం లో కరోనా మహమ్మారి లేకపోయినట్లు అయితే ఇద్దరూ ఈపాటికే మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యేవారు.
ఇటీవల సినీ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ కు రణబీర్ కపూర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంలో తన వ్యక్తిగత జీవితం గురించి మరియు పెళ్లి గురించి రణబీర్ ఓపెనయ్యారు. కరోనా లేకపోయి ఉంటే ఈ పాటికి మా పెళ్లి జరిగి ఉండేదని రణబీర్ అన్నారు. ఆ ఇంటర్వ్యూ లో రణబీర్ మాట్లాడుతూ “నేను ఏదో ఒకటి చెప్పి సరిపుచ్చాలనుకోవడం లేదు. నా జీవితంలో చాలా త్వరగా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటున్నా“ అని చెప్పాడు.
లాక్ డౌన్ సమయంలో రణబీర్ ఏదైనా కొత్త విద్యను అభ్యసించాడా అని అడగగా దానికి సమాధానం గా “నా ప్రియురాలు అలియా నే ఈ లాక్ డౌన్ ను సద్వినియోగం చేసుకుంది. తనకి అందుబాటులో ఉన్నవన్నీ నేర్చుకుంది. గిటార్ నుండి సీన్ రైటింగ్ వరకు తనకి ఇంటరెస్ట్ ఉన్న ప్రతిదీ నేర్చుకుంది. ఆమె పక్కన నేను ఎప్పుడూ అండర్ అచీవర్ ని అనే నేను భావిస్తాను. కానీ నేను ఈ లాక్ డౌన్ లో కొత్తగా నేర్చుకున్నది ఎం లేదు. రోజు కి రెండు-మూడు సినిమాలు చూసాను“ అని రణబీర్ తెలిపారు.
అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన `బ్రహ్మాస్త్ర`లో ఆలియా – రణబీర్ కలిసి జంటగా మొదటిసారి నటించారు. ఇందులో అమితాబ్ బచ్చన్ – డింపుల్ కపాడియా – నాగార్జున అక్కినేని కూడా నటించారు. ఆలియా మరియు రణబీర్ ల మధ్య ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రేమ చిగురించిందట. నిజానికి సినీ ఇండస్ట్రీ లో బ్యాచిలర్లందరికీ ఈ కరోనా సీజన్ అన్ని రకాలుగా కలిసొచ్చింది. బహుశా రణబీర్ తండ్రి రిషీ కపూర్ మరణం బాధించడంతో ఈ పెళ్లిని వాయిదా వేసుకున్నాడని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?