ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్ హీరోలు తాజాగా ఒకే వేదికపై ఫోజులు ఇచ్చారు. పూర్తి మేటర్ లోకి నిర్మాత దిల్ రాజు 50వ జన్మదిన వేడుక కి సంబంధించిన కార్యక్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, ప్రభాస్ తో పాటు విజయ్ దేవరకొండ ఇంకా చాలా మంది హీరోలు హాజరయ్యారు. వీళ్లంతా ఒకే వేదికపై ఫోటోలు దిగుతూ పోజులిచ్చారు.
అంతమాత్రమే కాకుండా మహేష్, పవన్ కళ్యాణ్ కూడా ఒక చోట ఫోటో దిగడం జరిగింది. ఇండస్ట్రీలో ఎప్పటినుండో వీరిద్దరిని కలిసి చూడాలి అని భావిస్తున్న చాలా మందికి ఈ ఫోటో చూసి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు చాలా మంది డైరెక్టర్లు మరియు నిర్మాతలు కుర్ర హీరోలు రావడం జరిగింది.
లాక్ డౌన్ సమయం లో రెండో వివాహం చేసుకున్న దిల్ రాజు.. అప్పట్లో ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పెద్దగా పార్టీ ఇవ్వలేక పోవటంతో మొత్తం బ్యాలెన్స్ అంతా తన 50వ జన్మదిన వేడుకలలో భారీ స్థాయిలో ఇండస్ట్రీ వాళ్లకు పెద్ద పార్టీ అరేంజ్ చేసినట్లు తాజా ఫోటోలు బట్టి తెలుస్తోంది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ జన్మదిన వేడుకలలో ఇండస్ట్రీకి చెందిన టాప్ మోస్ట్ హీరోలంతా ఒకే చోట ఫోటోలు దిగటం సంచలనంగా మారింది.