నచ్చావులే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయింది మాధవిలత. ఆ తర్వాత నాని తో ఒక సినిమా చేసింది. ఈ సినిమా ఫ్లాప్ గా మిగిలింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేసింది. అప్పుడప్పుడు వెబ్ సిరీస్ లో కనిపిస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక అంశం మీద చర్చ చేస్తూనే ఉంటుంది. బీజేపీ లో చేరిన మాధవిలత రెగ్యులర్ గా మీడియాలోను కనిపిస్తూ వస్తుంది. అంతేకాదు సోషల్ మీడియాలో పలు అంశాలపై స్పందిస్తూ ఉంటుంది.
ఈ క్రమంలో మాధవిలత మీద కొందరు నెటిజన్స్ బ్యాడ్ కామెంట్స్ చేయడం వాటికి మాధవిలత అంతే ఘాటుగా సమాధానం ఇవ్వడం గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మాధవిలత అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిందంటూ కేసు నమోదు అయింది. ఈ విషయం సోషల్ మీడియాలో చాలామంది చర్చించుకుంటున్నారు కూడా.
వనస్థలిపురంకు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి కేసు పెటాడు. ఇందుకు కారణం హిందువులను కించ పరిచే విధంగా మాధవిలత వ్యాఖ్యలు ఉన్నాయన్నది సారాంశం. అలాగే ఫిర్యాదులో గోపీకృష్ణ తెలిపాడు. సోషల్ మీడియాలో మాధవిలత కామెంట్స్ చేయడంతో ఈ కేసు సైబర్ క్రైమ్ గా నమోదు అయ్యింది. అయితే మాధవిలత ఇలా వ్యాఖ్యలు చేసిన విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. వాస్తవంగా నేను అసలు ఎలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయలేదని.. ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పాను అని తెలిపింది.
ఒక పోస్ట్ లో ముస్లీం సోదరుడు ఒకరు మోడీ గారు ప్రతి ముస్లీం ను ఉగ్రవాదిగా పరిగణిస్తారు. కేవలం ముస్లీంల్లో మాత్రమే ఉగ్రవాదులు ఉన్నారా.. హిందువుల్లో ఉగ్రవాదులు లేరా అని ప్రశ్నించాడు. అందుకు నేను ఇచ్చిన సమాధానం.. మీలో అందరు కాదు సోదర కొందరు మాత్రం సహకరిస్తున్నారు. అందులో హిందువులు కూడా ఉన్నారు. అంతా చెడ్డ వారు కాదు. కొద్ది మంది చెడ్డ వారు అన్ని చోట్ల ఉన్నారు అనేది తన అభిప్రాయం అని అతడికి చెప్పాను.
అంతేగాని నేను హిందువులను కించ పర్చే విధంగా ఎక్కడ వ్యాఖ్యలు చేశానో నాకు అర్థం కాలేదు. నేను తెలుగును ఇంగ్లీష్ లో రాయడం కేసు పెట్టిన వ్యక్తికి, కేసు నమోదు చేసిన పోలీసులకు అర్థం కాలేదేమో అంటూ రివర్స్ లో మాధవిలత అంటోంది. మొత్తానికి మాధవిలత చేసిన ఒకే ఒక్క కామెంట్ ..తీసుకు వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చో బెట్టింది.