టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ క్రేజ్ మామూలుగా ఉండదు అన్న సంగతి అందరికీ తెలుసు. ముఖ్యంగా మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరో బాలయ్య బాబు. డాన్స్ పరంగా అదేవిధంగా ఫైట్స్ పరంగా ముఖ్యంగా డైలాగులు పరంగా ఇండస్ట్రీలో తనకంటూ సెపరేట్ క్రేజ్ క్రియేట్ చేసుకోవడం మాత్రమే కాక టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక రికార్డులు కూడా సృష్టిస్తూ ఉంటారు.
అటువంటి బాలయ్య బాబుతో గతంలో వీరభద్ర సినిమాలో నటించిన హీరోయిన్ తను శ్రీ దత్త ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. తెలుగులో బాలయ్య బాబు తో మాత్రమే అదికూడా వీరభద్ర సినిమా ఒకటే చేసిన ఈ ముద్దుగుమ్మ చాలా సినిమాలు బాలీవుడ్ లోనే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి అదేవిధంగా బాలకృష్ణ గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ.. సౌత్ ఇండస్ట్రీ ఆడియన్స్ చాలా డిఫరెంట్ ఆడియన్స్ అని తెలిపింది.
ఈక్రమంలో బాలయ్యతో సినిమా చేసే సమయంలో అప్పటి అనుభవాలను గురించి మాట్లాడుతూ.. అయినా ఇతర నటీనటులను ఎంతో మర్యాదగా చూసే హీరో అని వెరీ జెంటిల్మేన్ అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. వీరభద్ర సినిమా చేస్తున్న టైమ్ లో స్వయంగా బాలయ్య ఇంటి నుండి భోజనం వచ్చేదని తెలిపింది. అప్పట్లో అది తినే నేను 5కిలోల బరువు పెరగటం జరిగిందని.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన నటీనటులకు ఎంతో మర్యాద ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో తెలుగులో అవకాశాలు వస్తే ఖచ్చితంగా చేస్తాను అంటూ తను శ్రీ దత్త తెలిపింది.