ఈ ఏడాది ప్రారంభంలోనే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది పూజా హెగ్డే. ఈ సినిమా సక్సస్ తో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది. దాంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా ‘రాధేశ్యామ్’ లో ప్రభాస్ కి జంటగా నటిస్తోంది.
ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ అంటే పూజా హెగ్డే నే. స్టార్ హీరోల సినిమాలలో వరసగా అవకాశాలు అందుకుంటూ బ్లాక్ బస్టర్స్ ని తన ఖాతాలో వేసుకుంటుంది. లక్కీ హీరోయిన్ అన్న పేరు సాధించింది. ఇప్పుడు తెలుగు లో అక్కినేని అఖిల్ తో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాలోను నటిస్తుంది పూజా హెగ్డే. కరోనా క్రైసిస్ వున్నా రెమ్యూనరేషన్ మాత్రం తగ్గే ప్రసక్తే లేదని చెబుతుందట.
ముఖ్యంగా ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బస్టర్ తర్వాత పూజా తన రెమ్యూనరేషన్ భారీగానే పెంచేసింది. ఈ విషయంలో ప్రొడ్యూసర్స్ కి షాకిచ్చినప్పటికి పూజా హెగ్డే కి ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ వల్ల కాంప్రమైజ్ అవుతున్నారట. అంతేకాదు పూజా హెగ్డే దక్షిణాది చిత్రాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోందట. ప్రస్తుతం ముంబైలో వుంటున్న పూజా హైదరాబాద్ లోనూ సొంతగా ఇల్లు కొనుక్కోవాలని చూస్తుందట.
ఇక పూజా హెగ్డే కి తెలుగు, హిందీ భాషల తో పాటి తమిళంలోను వరుసగా ఆఫర్లు వస్తుండటంతో ఇక్కడికే మకాం మార్చాలని ప్లాన్ చేసుకుంటుందట. ట్రిపుల్ బెడ్రూమ్ లగ్జరీ ఫ్లాట్ ని కొనాలన్న ప్రయత్నాల్లో వుందని తెలుస్తుంది. ఇక బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?