యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ అన్న భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని దాదాపు 750 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. బాలీవుడ్ దర్శ దిగ్గజం ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక అదిపురుష్ లో ప్రభాస్ రాముడుగా కనిపిస్తాడని డైరెక్టర్ ఓం రౌత్ ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడే హింట్ కూడా ఇచ్చాడు. దాంతో ప్రభాస్ పక్కన సీత గా నటించబోయోది ఎవరు అన్న చర్చ మొదలైంది. ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ సినిమా ఇండస్ట్రీలలో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరి పేర్లు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ముందుగా నయనతార పేరు వినిపించింది. గతంలో నయనతార ప్రభాస్ తో యోగి అన్న సినిమా చేసింది. బాపు, బాలక్రిష్ణ ల కాంబినేషన్ లో వచ్చిన రామరాజ్యం సినిమాలో సీతగా నయనతార నటించి ఆకట్టుకుంది. అందుకే ఇపుడు ప్రభాస్ పక్కన సీతగా నయనతార అయితే బావుంటుందన్న ఆలోచనతో మేకర్స్ నయనతార ని అనుకున్నారట. అలాగే కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తుంది. మహానటి సినిమాతో కీర్తి సౌత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రభాస్ కి జోడీగా సీత పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తే ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటిస్తూ విపరీతమైన పాపులారిటీని సాధించింది.
అందుకే ఆదిపురుష్ లో కీర్తి ని తీసుకోవాలన్న ప్లాన్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ఈ ఇద్దరి తో పాటు సీత పాత్రకి పూజా హెగ్డే పేరు కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పూజా హెగ్డే ప్రభాస్ కలిసి రాధే శ్యామ్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు కియారా అద్వాని పేరు పరిశీలిస్తున్నట్టు తెలుసుంది. నయనతార, కీర్తి సురేష లతో కంపేర్ చేస్తే కియారా కి అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ లో యమా క్రేజ్ ఉంది. అంతేకాదు ప్రస్తుతం బాలీవుడ్ లో కియారా చేస్తున్నన్ని క్రేజ్ ప్రాజెక్ట్స్ మరే హీరోయిన్ చేయడం లేదు.
అందుకే కియారా ని సీతగా తీసుకుంటే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కానీ లస్ట్ స్టోరీస్ లో నటించిన కియారా ని సీత గా చూడాలంటే అందరూ నో అనే అంటున్నారట. మరి ప్రభాస్ వరకు ఈ మ్యాటర్ వెళితే ఏమంటాడో చూడాలి. మొత్తానికి సీత గా ఏ హీరోయిన్ ఫైనల్ చేయాలో మేకర్స్ పెద్ద సవాల్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?