ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం రాజకీయాలలో కీలక నేతలుగా జేసీ బ్రదర్స్ రాణించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి టైములో జేసీ దివాకర్ రెడ్డి మంత్రిగా కూడా పని చేయడం జరిగింది. కాగా వైయస్ మరణించాక, సరిగ్గా 2014 ఎన్నికల ముందు ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో ఆ సమయంలో తెలుగుదేశం తీర్థం జేసీ బ్రదర్స్ పుచ్చుకోవటం జరిగింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికలలో అనంతపురం టీడీపీ ఎంపీగా గెలిచిన జేసీ దివాకర్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలకంగా రాణించారు.
ఆ సమయంలో సొంత పార్టీ నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడటం బహిరంగ వేదికలపైన, మీడియా ముందు సామాజికవర్గాలు అంటూ పార్టీలో పెత్తనాలు అంటూ జేసీ దివాకర్ రెడ్డి విమర్శనాత్మకమైన కామెంట్లు చేసేవారు. ఆ టైంలో పార్టీలో ఉన్న నాయకులు జేసీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చాలా మంది చెప్పినా బాబు పట్టించుకోలేదు. అయితే ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో జేసీ కుటుంబానికి సంబంధించిన వారు పోటీచేసిన ఎవరు గెలవలేదు. చాలా దారుణంగా ఓటమి పాలవడం జరిగింది.
ఇదిలా ఉండగా ఇటీవల జేసీ బ్రదర్స్ లో ఒకరైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి నకిలీ పత్రాలతో ట్రావెల్స్ వాహన కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్లు విషయం లో అడ్డంగా దొరికిపోవడంతో అరెస్ట్ అవ్వడం అందరికీ తెలిసిందే. ఈ కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు అస్మిత్ రెడ్డి కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. అయితే ఈ అరెస్టు విషయంలో మొదటి లో నారా లోకేష్, చంద్రబాబు హడావిడి చేసినా గాని జిల్లాలో ఏ ఒక్క టీడీపీ నాయకుడు కార్యకర్త పెద్దగా పట్టించుకోకపోవడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. దానికి కారణాలు చూస్తే జేసీ బ్రదర్స్ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించి అక్రమాలు చేసి సాక్షాలతో సహా అరెస్ట్ అవ్వడం ఒక కారణం కాగా మరొకటి నోటిదురుసు తో ఎవరితో పడితే వారితో గొడవలు పడటం, అదేవిధంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం అని జిల్లా నేతలు చర్చించుకుంటున్నారు.
సొంత సామాజిక వర్గానికి చెందిన రెడ్డి సామాజిక వర్గాన్ని అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం పై నోటికి ఎంత వస్తే అంత అధికారంలో ఉన్న టైంలో మాట్లాడటంతో.. జేసీ బ్రదర్స్ పై వస్తున్న అక్రమాలు ఆరోపణలు అరెస్టుల విషయంలో అనంతపురం జిల్లాకి చెందిన ఏ రాజకీయ నేత పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ బలంగా వినబడుతోంది. మొత్తం మీద అడ్డగోలుగా సంపాదించి అందరి పై నోరు పారేసుకోవడం తోనే జేసీ బ్రదర్స్ కి గత ఎన్నికలలో ప్రజెంట్ బాగా డ్యామేజ్ జరుగుతున్నట్లు చాలా మంది భావిస్తున్నారు.