Vikram Kirloskar: దేశీయ ఆటోమోటివ్ ఇండస్ట్రీలో టాప్ కంపెనీగా రాణిస్తోంది టయోటా కీర్లోస్కర్ మోటార్ కార్ప్. కాగా ఈ సంస్థ వైస్-ఛైర్మన్ విక్రమ్ కీర్లోస్కర్ మంగళవారం అర్ధరాత్రి గుండెపోటుతో మరణించారు. ఈ మరణంతో ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. విక్రమ్ వయసు 64 ఏళ్లు. ఉన్నట్లుండి ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోవడంతో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదిలా ఉండగా ఆయన అంత్యక్రియలు బెంగుళూరులోని హెబ్బాల్ స్మశానవాటికలో నిర్వహించనున్నారు. విక్రమ్ కిర్లోస్కర్ చివరిగా నవంబర్ 25న ముంబైలో జరిగిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Vikram Kirloskar: విక్రమ్ కిర్లోస్కర్ బ్యాక్గ్రౌండ్
విక్రమ్ కిర్లోస్కర్ యూఎస్లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (ఏఐటి) నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. 1990 చివర్లో జపాన్కు చెందిన టయోటా కార్పొరేషన్ను ఇండియాకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 1888లో ప్రారంభం అయిన కిర్లోస్కర్ గ్రూప్లో విక్రమ్ నాలుగో తరంవారు. ఆయన విక్రమ్ కిర్లోస్కర్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించారు. కిర్లోస్కర్ గ్రూప్ పంపులు, ఇంజన్లకు సంబంధించిన వాటితో పాటు కంప్రెసర్ లను తయారు చేస్తుంది.
విక్రమ్ ఎస్. కిర్లోస్కర్ అచీవ్మెంట్స్
విక్రమ్ కిర్లోస్కర్ కర్ణాటకలోని బెంగుళూరు నివాసి. ఆయన టయోటా గ్రూప్లో పార్ట్నర్గా ఉంటూనే, ఆ రాష్ట్రంలో పెద్ద ఆటో మొబైల్ తయారు సంస్థను ప్రారంభించడానికి బాధ్యతలు తీసుకున్నారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం విక్రమ్ కృషిని గుర్తించి ఆయనకు ‘సువర్ణ కర్ణాటక ‘ అవార్డు ఇచ్చింది. 2020లో విక్రమ్ కిర్లోస్కర్ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటల్స్ (IIM) ప్రతిష్ఠాత్మకమైన IIM-JRD టాటా అవార్డుతో సత్కరించింది. ‘ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ లీడర్షిప్ ఇన్ మెటలర్జికల్ ఇండస్ట్రీస్’ ద్వారా దేశానికి ఆయన చేసిన సేవలకుగానూ ఈ అవార్డు లభించింది.
We are extremely saddened to inform the untimely demise of Mr. Vikram S. Kirloskar, Vice Chairman, Toyota Kirloskar Motor on 29th November 2022. At this time of grief, we request everyone to pray that his soul rests in peace. [1/2]
— Toyota India (@Toyota_India) November 29, 2022
మరో సారి గత ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించి విమర్శించిన సీఎం వైఎస్ జగన్