Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రబల్లిలో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ నిర్వహిస్తామని తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. వరి వేస్తే ఉరే అన్న కేసిఆర్.. ఆయన వ్యవసాయ క్షేత్రంలోని 150 ఎకరాల్లో యాసంగి వరి పండిస్తున్నారని నిన్న రేవంత్ వ్యాఖ్యానించారు. ఈ పంటను మీడియాకు చూపుతానని పేర్కొన్నారు.
Revanth Reddy: రేవంత్ ఇంటి చుట్టూ పోలీసు బలగాల మోహరింపు
ఈ నేపథ్యంలో సోమవారం ఆయనను రచ్చబండకు వెళ్లనివ్వకుండా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఆయన ఇంటి వద్దకు చేరుకుని గృహ నిర్బంధం చేశారు. ఇంటి చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీని పై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదిక ద్వారా స్పందించారు. తెలంగాణ పోలీసులకు స్వాగతం, నా ఇంటికి వచ్చే అన్ని దారులను పోలీసులు చుట్టుముట్టారు. ప్రభుత్వం దేనికి భయపడుతోంది. ఎందుకు భయపడుతోంది. అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తన ఇంటి సమీపంలో అన్ని దారుల్లో పోలీసులు మోహరించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు రేవంత్ రెడ్డి.
ఎర్రవల్లి రచ్చబండకు పోలీస్ అనుమతి లేదు
ఎర్రవల్లిలో మీటింగ్ పెట్టడానికి రేవంత్ రెడ్డికి అనుమతి లేదని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఎలాగైనా రచ్చబండ నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ శ్రేణులు పట్టుబడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నేతలను ఎక్కడి కక్కడ అరెస్టులు చేస్తున్నారు. చాలా మంది కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందు సోమవారం ఉదయం నుండే పహారా కాస్తూ వారందరినీ హౌస్ అరెస్టు చేశారు.
Welcome to police state of Telangana…
All roads leading to my house surrounded by the police…
What is the government afraid of…?!
Why is it afraid…?! pic.twitter.com/346yI5w9jx— Revanth Reddy (@revanth_anumula) December 27, 2021