Bathing:తెల్లవారు ఝామున లేచి తల కి ఒంటికి నూనె పెట్టుకుని స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అంటారు.దీని కోసం నువ్వుల నూనె ,కొబ్బరి నూనె ,ఆవ నూనె లను వాడతారు. ముందుగా అభ్యంగన స్నానం చేయడానికి నూనెలలో ఏదైనా ఒక దానిని ఉపయోగించి తలకు ,శరీరం మొత్తం బాగా పట్టించి మర్దనా చేయాలి.
శరీరం మొత్తం మర్దన చేసిన 15 నిమిషాల తర్వాత సున్నిపిండితో శరీరం మొత్తం నలుగు పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత శుభ్రమైన గోరువెచ్చని నీటితో తలంటు స్నానం చేయడాన్ని అభ్యంగన స్నానం అని అంటారు.
ఈ విధంగా స్నానం చేయడం వల్ల మన శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని మన పెద్ద వారు అంటున్నారు. .ఈ అభ్యంగన స్నానం వల్ల చర్మం పై ఏర్పడిన గజ్జి,చిడుము,సర్పి, వంటి చర్మ రోగాలు తగ్గిపోతాయి.మన శరీరంపై ఉన్న మలినాలు పోవడం వల్ల శరీరం మంచి వాసనతో తాజాగా ఉంటుంది. నలుగు వలన శరీరం అంతా ఎంతో తేలికగా హాయిగా ఉండే మంచి నిద్ర పడుతుంది. ఈ విధంగా నూనెలతో శరీరం అంతా బాగా మర్దన చేసి సున్నిపిండితో నలుగు పెట్టడం వల్ల శరీరం మీద మృతకణాలు తొలగి శరీరం మృదువుగా, కాంతివంతంగా ఉండడం తో పాటు కళ్లకు కూడా చలువ చేస్తుంది.
అభ్యంగన స్నానం వల్ల కాళ్ళు, చేతులు మంటలు కూడా తగ్గిపోతాయి.అభ్యంగన స్నానం కేవలం పండుగలు లేదా పెళ్లి పుట్టిన రోజు వంటి ప్రత్యేక రోజుల లో మాత్రమే చేస్తుంటారు.అభ్యంగన స్నానం చేయటం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి కాబట్టి మన పూర్వీకులు ఈ స్నానానికి అంత ప్రాధాన్యత ఇచ్చేవారు..కాకపోతే ప్రస్తుత జీవన విధానంలో ఇలాంటి ఆచారవ్యవహారాలు పాటించ లేకపోవడం వల్ల మన శరీరానికి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి. అభ్యంగన స్నానం వారంలో కనీసం ఒకరోజు అయిన చేయగలిగితే శరీర వ్యాధుల నుండి దూరంగా ఉండవచ్చు.