Tree: మనుషులను నరకం నుండి తప్పించే వాటిలో వృక్షాలు ప్రధానమైనవి అని “శ్రీ వరాహా పురాణం“ లో 172వ అధ్యాయం లో ఉన్న , 36 వ శ్లోకం లో చెప్పబడింది వాటి గురించి తెలుసుకుని అమలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒక వేళా మీకు స్వర్గం నరకం మీద నమ్మకం లేకపోయినా చెట్లు పెంచడం అనేది అందరికి అవసరమైన విష్యం కాబట్టి ప్రయత్నం చేయండి.
మానవుడు తన జీవిత కాలం లో ఒక రావి చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు,ఒక నిమ్మ చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, ఐదు మామిడి చెట్లు, పది పూల చెట్లు నాటి సంరక్షించేవాడు నరకానికి వెళ్ళడు అని పురాణం తెలియచేస్తుంది.మనం నాటిన మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే మళ్ళి జన్మలో మనకు సంతానంగా వస్తాయి అని హిందూ దర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. అలాగే వృక్షా దానం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ముఖ్యమైనవి.
వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది.
వృక్షాలను బాధించడం వంటివి చేయడం మొక్కలను పీకివేయడం కాని, వాటిని నరికి వేయటం లాంటివి చేయకూడదు. పక్షులకు, జంతువులకు, ఇతర జీవులకు అవి రక్షణ గా ఉంటాయి అని తెలియచేయడం జరిగింది.
మనుషులకు లాగే వృక్షాలలో కూడా సంతోషం, దుఃఖం వంటివి కలుగుతాయి అని పరిశోధనలు కూడా తెలియచేస్తున్నాయి . గతజన్మలో చేసుకున్న పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే వృక్షా జన్మలో అనుభవిస్తుంటామని తెలియచేయడం జరిగింది. మనుషుల సంతోషం కోసమే దేవుడు వృక్షాలను పుట్టించాడు. ఎండావానలకు తట్టుకుని నిలిచే వృక్షాలు మనుషులను మాత్రం ఎండ, వానల నుండి రక్షణ కల్పిస్తాయి. మహర్షులు కూడా ఈ వృక్షాల నీడనే గాఢమైన తపమాచరించే వారని పురాణ గాధలు తెలియచేస్తున్నాయి. నరకాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టుకుని ఆశాభావాన్ని పెంచుకోవడం కోసం మొక్కలు నాటి పెంచి పోషిస్తూ వృక్షాలు గా చేసి తరిద్దాం. మీకు ఇవేమి నమ్మకం లేకపోయినా భావితరాల భవిషత్తు కోసం ఇచ్చే గొప్ప బహుమతి గా గుర్తించండి.