Trending viral: వయసు పెరిగే కొద్దీ ఎవరైనా కృష్ణా రామా అంటూ ఆధ్యాత్మిక బాటలోకి వెళ్తుంటారు. మనవళ్లతోనో, మనవరాళ్లతోనే కబుర్లు చెబుతూ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారు. అయితే 80 ఏళ్ల వయసులో ఓ బామ్మ మాత్రం అందరికీ షాకిచ్చింది. హరిద్వార్లోని హర్ కీ పౌరి వంతెనపై నుంచి గంగలోకి దూకిన బామ్మ ఈత కొడుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వయసులో ఉధృతంగా ప్రవహించే గంగా నదిలో నిర్భయంగా దూకి, చక్కగా ఈత కొడుతూ తేలిగ్గా ఒడ్డున తేలడం నిజంగా అందరినీ ఆకర్షిస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Trending viral: బామ్మకు గుర్తొచ్చిన పాత రోజులు
హర్ కీ పౌరీ బిల్డింగ్పై నుంచి అనే భయం లేకుండా గంగలో దూకే ఈ వృద్ధురాలి వయసు 80 ఏళ్లు పైనే ఉంటుంది. ఈ వయసులో నడవలేమని, కూర్చోలేమని వృద్ధులు ఇబ్బందులు పడుతుంటారు. మిగిలిన వారిలా ఆమె మాత్రం మూలన కూర్చోలేదు. వృద్ధులు ఏమీ చేయలేరనే ఊహల్ని ఆమె పటాపంచలు చేసింది. హర్యానాలోని జింద్లో నివసిస్తున్న ఆ వృద్ధ మహిళ హర్ కీ పౌరిలో స్నానం చేయాలని భావించింది. ఈలోగా కొందరు యువకులు ఎత్తైన వంతెనపై నుంచి గంగానదిలోకి దూకడం చూసింది. ఆ వృద్ధురాలు కూడా తన పాత రోజులను గుర్తుచేసుకుని ఉద్వేగానికి లోనైంది.
అంతెత్తు నుంచి నదిలో దూకి..
వెంటనే ఆమె కూడా వంతెనపైకి చేరుకుని నేరుగా గంగానదిలోకి దూకింది. ఈ అద్భుత విన్యాసాన్ని అక్కడికక్కడే ఉన్న కొందరు తమ మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. బామ్మ స్టంట్ వీడియోను చూసి, సోషల్ మీడియా యూజర్లు ఊపిరి బిగబట్టుకున్నారు. అంతలా ఆమె చేసిన ఫీట్ నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. అందరూ ఆమెకు ఏదైనా అయి ఉంటుందని అనుకున్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ ఆమె ఎంచక్కా ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చేసింది.