Trinatha rao nakkina : సినిమా చూపిస్తా మావ, నేను లోకల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. ఈ రెండు సినిమాల తర్వాత ఆ డైరెక్టర్ టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్ కోసం ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. అయితే వెంకటేశ్ వరుసగా నారప్ప, ఎఫ్ 3, దృశ్యం సినిమాలను కమిటవడం వల్ల ఆలస్యం అయింది. ఇదే కాకుండా గత ఏడాది నుంచి కరోనా వెంటాడుతుండటంతో కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ అనౌన్స్ అవలేదు. ఈ క్రమంలో దర్శకుడు త్రినాథ రావు ప్రాజెక్ట్స్ కూడా ఏవీ మొదలవలేదు. వెంకీతో మాత్రమే కాకుండా ఈ డైరెక్టర్మా మాస్ మహారాజ రవితేజతో కూడా ఓ ప్రాజెక్ట్ ఉంది.
అయితే ఈ ప్రాజెక్ట్స్ లేవని మళ్ళీ త్రినాథరావు కొత్తగా ప్రయత్నాలు చేయాల్సిందేనంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్స్ కి తాజాగా దర్శకుడు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చాడు. రవితేజ తో ఈ ఏడాది ప్రాజెక్ట్ ఉంటుందని చెప్పాడు. ఇప్పటికే ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిందని.. అన్నీ అనుకూలిస్తే షూటింగ్ కు వెళ్ళడానికి రెడీగా ఉన్నామని వెల్లడించాడు. రవితేజ ఎస్ అంటే సెట్స్ పైకి వెళ్ళడమేనట. ఇక రవితేజ తో తీయబోయే సినిమా ఆయన శైలిలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని అన్నారు.
Trinatha rao nakkina : బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయనున్నాడని క్లారిటీ వచ్చేసింది.
అంతేకాదు విక్టరీ వెంకటేష్ తో కూడా సినిమా ఉంటుందని దీనికి సంబంధించిన స్క్రిప్టు పూర్తి చేశానని.. క్లైమాక్స్ ఎలా ఉండాలనేది ఇంకా చర్చలు జరుపుతున్నాయని తెలిపాడు. కాగా ఈ రెండు సినిమాలను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా బ్యానర్ లో టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభొట్ల నిర్మిస్తారని దర్శకుడు త్రినాథ రావు నక్కిన వెల్లడించారు. నా సినిమాలు ఆగిపోయాయని వస్తున్న వార్తలలో ఎంతమాత్రం నిజం లేదని అన్నారు. ఈ లెక్కన వెంకీ, రవితేజల తో ఈయన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయనున్నాడని క్లారిటీ వచ్చేసింది.