Trisha : సూపర్ స్టార్ మహేష్ బాబుతో సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష మరోసారి నటించబోతోందా…అవుననే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో ..సోషల్ మీడియాలోనూ న్యూస్ వచ్చి వైరల్ అయి హాట్ టాపిక్ గా మారింది. త్రిష టాలీవుడ్ అండ్ కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో దాదాపు 15 ఏళ్ళ నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలను చేస్తూ వస్తోంది. ఒకానొక దశలో త్రిష స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం కాస్త తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ తమిళంలో మాత్రం ఆరేడు సినిమాలను చేస్తోంది. అందులో
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందిస్తున్న పొన్నియన్ సెల్వన్ ఒకటి. కాగా తాజాగా మళ్ళీ త్రిష టాలీవుడ్ లో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమాతో అంటున్నారు.
మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికి ఇది హ్యాట్రిక్ మూవీ. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. అయితే మెయిన్ హీరోయిన్ పాత్రకు పూజా హెగ్డే పేరు వినిపిస్తోంది. అలాగే సెకండ్ లీడ్ రోల్ ను నివేద థామస్ చేయనుందని ప్రచారం జరుగుతోంది. అయితే వీరిలో ఒక హీరోయిన్ ప్లేస్ లో త్రిషని రీ ప్లేస్ చేయనున్నారని సమాచారం. దాదాపు పూజా హెగ్డే ఫైనల్ అని, త్రిష సెకండ్ లీడ్ అనే మాట కూడా వినిపిస్తోంది. ఇదే నిజమైతే త్రివిక్రమ్ – మహేష్ బాబు – త్రిష కాంబినేషన్ లో వచ్చే రెండవ సినిమా అవుతుంది.
Trisha : మహేష్ తో వచ్చిన ఆఫర్ ను మాత్రం మిస్ చేసుకోకూడదని త్రిష భావిస్తుందట.
వాస్తవంగా మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమాలో ముందు త్రిషనే అనుకున్నారు. కానీ ఆ అవకాశం కాజల్ అగర్వాల్ కి దక్కించింది. ఆ తర్వాత బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో రూపొందుతున్న అఖండ మూవీలో నటించబోతోందని వార్తలు వచ్చాయి. కానీ ఫైనల్ గా ఈ ఛాన్స్ కంచె బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ అందుకుంది. వారి సినిమాలు మిస్ అయినా ఇప్పుడు మహేష్ తో వచ్చిన ఆఫర్ ను మాత్రం మిస్ చేసుకోకూడదని త్రిష భావిస్తుందట. ఇక ఈ మధ్య తనకి ఓ స్టార్ డైరెక్టార్తో పెళ్ళి కాబోతందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి వీటికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!