మెగాస్టార్ చిరంజీవి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో మెగా మల్టీస్టార్ కోసం ఒక్క మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం అన్ని సినిమా ఇండస్ట్రీలలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియన్ మల్టీస్టారర్స్ తెరకెకుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగులో బాహుబలి లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత మన టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్స్ … పాన్ ఇండియన్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ వరసగా రాధే శ్యాం, సలార్, ఆదిపురుష్ తో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు.
ఇక దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోలుగా ఆర్ ఆర్ ఆర్ అన్న భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళ సూపర్ హిట్ తెలుగు రీమేక్ తెరకెక్కబోతోంది. భారీ మల్టీస్టారర్ గా రూపొందబోతున్న ఈ సినిమా ఈ ఏడాదే సెట్స్ మీదకి వచ్చి విజయదశమి సందర్భంగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూస్తున్న మెగా మల్టీ స్టారర్ కూడా ఈ ఏడాది మొదలయ్యే అవకాశాలున్నాయని లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇండస్ట్రీ వర్గాలలో చక్కర్లు కొడుతోంది.
వాస్తవంగా ఈ సినిమాని టి. సుబ్బిరామి రెడ్డి ఎప్పుడో ప్రకటించారు. త్రివిక్రం దర్శకత్వం వహిస్తారని వార్తలు వచ్చాయి. అయితే విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ మొదలైందట. విజయదశమి పండుగ సందర్భంగా ఈ మెగా మల్టీస్టార్ ని ప్రకటించి 2022 లో సెట్స్ మీదకి తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెగాస్టార్ మూ సినిమాలు చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ 5 ప్రాజెక్ట్స్ కమిటయిన సంగతి తెలిసిందే. మరి మెగాస్టార్ – పవర్ స్టార్ ల కాంబోలో సినిమా ఎప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారో చూడాలి.