పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు చేస్తానని ప్రకటించిన తర్వాత అభిమానులకు అప్డేట్ ల పైన అప్డేట్ లు ఇస్తున్నాడు. నిన్ననే వకీల్ సాబ్ టీజర్ తో ప్రేక్షకులను కనువిందు చేసిన పవర్ స్టార్…. నేడు తన సినిమాకు సంబంధించిన మరొక అప్డేట్ బయటికి వచ్చింది.
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టార్ చేస్తున్న మలయాళం రీమేక్ సినిమాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పాత్ర ఉండబోతున్నట్లు నిర్మాతలు సంక్రాంతి సందర్భంగా యూట్యూబ్ వీడియో ద్వారా ప్రకటించారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకు రీమేక్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి తెలుగు సినిమా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సమకూరుస్తారు.
తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఒక హీరోయిన్ గా సాయి పల్లవి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ప్రసాద్ మూరెళ్ల ఫోటోగ్రఫీ కి సారథ్యం వహిస్తుంటే…. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తారు.