ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళితో “రౌద్రం రణం రుధిరం” టైటిల్ తో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పోరాట యోధుడు కొమరం భీం గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జంటగా బ్రిటన్ మోడల్ ఓలియా మోరెస్ నటిస్తుండగా విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ 5 నుంచి చిత్రీకరణ మొదలవనుందట. ముందు ఎన్టీఆర్, ఓలియా మీదే రాజమౌళి చిత్రీకరణ జరపబోతున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా తర్వాత మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రానున్న ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అన్న టైటిల్ ని అనుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ , ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు.
రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ పూర్తవగానే త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కానున్నాడు ఎన్టీఆర్. కాగా ఈ సినిమా గురించి ఒక హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకముందు అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ ని కంప్లీట్ మాస్ హీరోగా చూపంచిన త్రివిక్రమ్ ఈ సినిమాలో.. అత్తారింటికి దారేది లాంటి క్లాస్ సినిమాలో పవన్ కళ్యాణ్ ని చూపించినట్టుగా ఎన్టీఆర్ క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. అందుకే ఈ సినిమాకి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అని టైటిల్ ని అనుకుంటున్నారని సమాచారం.
అతారింటికి దారేది కంటే పదింతలు ఉండే స్క్రిప్ట్ సిద్దం చేడాట త్రివిక్రమ్. ఇక ఈ సినిమాలో ఉన్న కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణ ని తీసుకోవాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో పాత్రలకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ మాత్రమే చేయగల పాత్ర ఉందని తెలుస్తుంది.