టాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ డైరెక్టర్లలో ఒకరు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. సినిమాలో తన పంచ్ డైలాగులతో పాటు ఒక ఆహ్లాదకరమైన సముద్రం పక్కన కూర్చునే రీతిలో తన సినిమాలు తీస్తూ హీరోని ప్రేక్షకులు ఏ విధంగా చూడాలని ఆశ పడతారో ఆ రీతిలో కుటుంబ సమేతంగా అదేవిధంగా మాస్ ఆడియన్స్ ని మెప్పించే రీతిలో ఈ మాంత్రికుడు సినిమాలు ఉంటాయి.
అటువంటి త్రివిక్రమ్ కి ఇండస్ట్రీలో మంచి స్నేహితుడుగా పవన్ కళ్యాణ్ తో మంచి బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఒక్క పవన్ తో మాత్రమేకాక ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలతో త్రివిక్రమ్ కి మంచి సత్సంబంధాలున్నాయి. ఇదిలా ఉండగా కొత్త ఏడాది నేపథ్యంలో జనవరి మొదటి తారీఖున పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యి శుభాకాంక్షలు తెలిపి ఆయనకు త్రివిక్రమ్ బోకే ఇవ్వటం జరిగింది.
ఇదిలా ఉంటే జనవరి రెండవ తారీకున త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ అయి ఆయనకి కూడా ఒక బోకే ఇవ్వటంతో త్రివిక్రమ్ పవన్ తో అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా గత ఏడాది అలావైకుంఠపురంలో అనే సినిమాతో ఇండస్ట్రీకి మర్చిపోలేని హిట్ ఇచ్చిన త్రివిక్రమ్ తన నెక్స్ట్ సినిమా ఎన్టీఆర్ తో చేస్తున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్లో 30 వ సినిమా కావటంతో..నందమూరి అభిమానులు ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నారు. పైగా ఎన్టీఆర్ రాజమౌళి తో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న నేపథ్యంలో కచ్చితంగా.. సినిమా హిట్ అవ్వాలని స్టోరీ విషయంలో ఇంకా క్యారెక్టర్లు తీసుకునే దాని విషయంలో త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీలో టాక్. ఇలా ఉండగా ఈ సినిమాకి ‘అయిననూ పోయిరావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టాలని త్రివిక్రమ్ అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.