గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని నేరేడ్మెట్ డివిజన్లో టిఆర్ఎస్ విజయం సాధించింది. దీంతో గ్రేటర్లో టిఆర్ఎస్ స్థానాలు 55 నుండి 56కు చేరుకుంది. హైకోర్టు అదేశాల మేరకు నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఎన్నికల ఫలితం బుధవారం వివాదాస్పదమైన ఓట్ల లెక్కింపు తరువాత వెల్లడి అయ్యింది.సైనిక్పులిలోని భవన్స్ వివాకానంద కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది.
డివిజన్ లో మొత్తం 25,176 ఓట్లు పోల్ అవ్వగా ఈ నెల 4వ తేదీ కౌంటింగ్ సందర్భంలో 24,632 ఓట్లు లెక్కించారు. అప్పటి వరకూ లెక్కించిన వాటిలో 504 ఓట్ల అధిక్యతతో టీఆర్ఎస్ అభ్యర్థి మీనారెడ్డి ఉన్నారు. బ్యాలెట్పై ఇతర ముద్ర ఉన్న 544 ఓట్లకు నేడు లెక్కింపు నిర్వహించగా అందులో 278 ఓట్లు టిఆర్ఎస్ అభ్యర్థికి వచ్చాయి. దీంతో 782 ఓట్ల మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల అధికారి ఫలితాన్ని అధికారింగా ప్రకటించాల్సి ఉంది.
అయితే ఎన్నికల అధికారుల తీరుపై ప్రసన్న నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ కౌంటింగ్ కేంద్రం వద్ద కన్నీటి పర్యంతమైయ్యారు. రిజెక్ట్ అయిన 1300 ఓట్లు లెక్కించాలని బీజెపి నేతలు కౌంటింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేస్తున్నారు.