తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉన్న సమయంలో అధ్యక్షుడిగా రాణించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. విభజన జరిగిన తరువాత వైసీపీ పార్టీ తరఫున పొంగులేటి ఖమ్మం జిల్లాలో గెలవటం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లిపోవడం జరిగింది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా రాణిస్తున్న పొంగులేటి తాజాగా ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ అదేవిధంగా కేటీఆర్ ల గురించి సంచలన కామెంట్ చేశారు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో వైసిపి పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అని యాంకర్ ప్రశ్నించగా వాటిలో వాస్తవం లేదని పొంగులేటి చెప్పుకొచ్చారు. జగన్ మళ్లీ తెలంగాణలో పార్టీ ని స్టార్ట్ చేసే అవకాశం ఉండదని, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే తనకు కచ్చితంగా చెబుతారని అటువంటి సత్సంబంధాలు జగన్ తో తనకి ఉన్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
జగన్ తో ఎటువంటి ఎఫెక్షన్ ఉందో టిఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ తో కూడా అదేరీతిలో సత్సంబంధాలు ఉన్నాయని కచ్చితంగా రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ పార్టీ తరఫున తగిన న్యాయం తన పొలిటికల్ కెరియర్ కి జరుగుతుందని పొంగులేటి తెలిపారు.