“ప్రజలు కష్టాల్లో ఉంటే కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉంటారా?”… కేసీఆర్ ఓ పనికిమాలిన ముఖ్యమంత్రి అంటూ మొదలుపెట్టి… సీఎం నిర్లక్ష్యం వల్ల కేంద్ర సహాయాన్ని కూడా అందుకోలేకపోతున్నామనీ చెబుతూ… కేసీఆర్, కేటీఆర్ వారి చెంచాలు కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. కల్వకుంట్ల కుటుంబానికి ప్రపంచ వ్యాప్తంగా ఆస్తులున్నాయని.. ఎంపీ ఓవైసీని జిన్నాతో పోలుస్తారా? తెలంగాణ రాష్ట్రాన్ని హిందూ వ్యతిరేకుల చేతిలో పెట్టారు.. కేసీఆర్ పెద్దకొడుకు ఓవైసీ.. అంటూ బీజేపీ ఎంపీ అరవింద్ చెలరేగిపోయిన సంగతి తెలిసిందే!
తెలంగాణలో కేసీఆర్ ని ఈ రేంజ్ లో వాయించేసరికి… ఈ మాటలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపాయి.. ఫలితంగా తెరాస శ్రేణులు అగ్గిమీద గుగ్గిలం అయిపోయి.. ఆందోళన చేపట్టాయి. ఇందులో భాగంగా వరంగల్ లోని అర్బన్ బీజేపీ ఆఫీస్ పై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడులకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, తెరాస కార్యకర్తల మధ్య తోపులాటలు జరిగాయి. ఈ ఘర్షణలో ముగ్గురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎంపీ కారుపై టీఆర్ఎస్ కార్యకర్తలు కోడిగుడ్లతో కూడా దాడులు చేశారు.
దీంతో కేసీఆర్ పై ఎవరైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తే దాడులు తప్పవనే సంకేతాలు పరోక్షంగా కేసీఆర్ & కో ఇచ్చినట్లేనని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. కరోనా వల్ల రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై భారీ భారం పడటంతో కేసీఆర్ ఫుల్ బీపీలో ఉంటున్నట్లు అనిపిస్తునారనే కామెంట్లు వస్తున్నయి! ఈ నేపథ్యంలో అరవింద్ మాటలు కేసీఆర్ కు పుండు మీద కారం చల్లినట్లయాయని.. దాని ఫలితమే “బీజేపీ ఎంపీపై తెరాస శ్రేణుల దాడి” అని పలువురు అభిప్రాయపడుతున్నారు! ఏది ఏమైనా… అరవింద్ విషయంలో చూపించిన అటాకింగ్ నేచర్ ని అధికార పార్టీ పెద్దలు కరోనా పై కూడా చూపించాలని ఈ సందర్భంగా కామెంట్లు రావడం కొసమెరుపు!!