NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

TRS: ‘సాగర్’ ఫలితంపై గులాబీ నేతల గుబులు!గెలుపు పై దిగులు!

TRS: టీఆర్ఎస్ లీడర్లకు నాగార్జునసాగర్  టెన్షన్ పట్టుకుంది. ఉప ఎన్నికలో గెలుస్తామా? లేదా? అని భయపడుతున్నారు.  సెగ్మెంట్ లోని మండలాలు, గ్రామాల వారీగా పోలైన ఓట్ల వివరాలు తెప్పించుకొని ఒకటికి రెండు సార్లు  పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు వరకు మంచి మెజార్జీతో గెలుస్తామని ధీమాగా ఉన్న లీడర్లు కూడా ఇప్పుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ మాట అటుంచి అసలు గెలుస్తామా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. వందల సంఖ్యలో లీడర్లు పనిచేసినా, కోట్లలో ఖర్చు చేసినా అనుకున్నట్టుగా రిజల్ట్ ఉండకపోవచ్చని ఎన్నికల ప్రచారానికి వెళ్లి వచ్చిన లీడర్లు చర్చించుకుంటున్నారు.

TRS leaders worried about Nagarjuna Sagar Bypoll Victory
TRS leaders worried about Nagarjuna Sagar Bypoll Victory

సర్వేలు, రిపోర్టులు చూసి కంగారు!

సీఎం కేసీఆర్ బహిరంగ సభ తర్వాత మంచి మెజార్టీతో గెలుస్తామని ఎన్నికల బాధ్యతలు చూసిన లీడర్లు చెప్పారు. కానీ ఓటింగ్ తర్వాత తమ అంచనాలు తప్పే చాన్స్​ ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిఘా వర్గాలు ఇచ్చిన రిపోర్టులు, టీఆర్ఎస్ కోసం పనిచేసిన ప్రైవేటు సర్వే సంస్థలు రూపొందించిన నివేదికలు చూస్తే అంచనాలు తప్పే ప్రమాదం ఉందని అంటున్నారు. ‘‘గొప్ప మెజార్టీ రాకపోవచ్చు.  అత్తెసరు ఓట్లుతోనే బయటపడే చాన్స్ ఉంది. ఒకవేళ గెలిచినా మాది  ఏకపక్ష విజయం కాదు’’ అని ఎన్నికల బాధ్యతలు చూసిన ఓ మంత్రి వివరించారు. కేసీఆర్ బహిరంగ సభ రోజునే పరిస్థితి తమకు అర్థమైందని ఆయన అన్నారు.

TRS: పోల్ మేనేజ్ మెంట్ బాగున్నప్పటికీ!

సాగర్​ ఎన్నికల షెడ్యూల్​ కంటే  15 రోజుల ముందు నుంచి సెగ్మెంట్​పై సీఎం కేసీఆర్​ ఫోకస్​ పెట్టారు.స్వయంగా రెండుసార్లు ఆయన నియోజకవర్గ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఏఏ మండలాల్లో పార్టీ బలహీనంగా ఉందో లెక్కలు తీశారు. కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి వెంట ఉండే లీడర్ల వివరాలను ఆరా తీశారు. మండలానికి ఓ ఎమ్మెల్యేను ఇన్​చార్జ్​గా నియమించి, జానారెడ్డిని బలహీనం చేసే పనిలో పడ్డారు. నామినేషన్ల ముగిసిన తర్వాత నుంచి ఎన్నికల ప్రచారం ముగిసేవరకు దాదాపు 1,500 మంది టీఆర్​ఎస్​ లీడర్లు సాగర్​ నియోజకవర్గంలో మకాం వేశారు. కాంగ్రెస్ లోని లీడర్లకు డబ్బులు ఆశచూపి టీఆర్​ఎస్​లో  చేర్చుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గ స్థాయి బీజేపీ నేతలు కొందరిని కూడా టిఆర్ఎస్ లాగేసింది. ప్రతి గ్రామంలో కులాల వారీగా ఓటర్లను విభజించి పెద్ద ఎత్తున డబ్బులు పంచినట్టు ప్రచారంలో ఉంది. ఇంత చేసినా గెలుపు దక్కుతుందా? లేదా? అనే అనుమానం టీఆర్​ఎస్​ లీడర్లలో కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి చాలా బలమైన పోటీ ఇచ్చారని టీఆర్ఎస్ నేతలు అంగీకరిస్తున్నారు.తమ పార్టీ గెలుపు దైవాధీనం అంటున్నారు.

 

author avatar
Yandamuri

Related posts

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N

Nagarjuna-NTR: నాగార్జున – ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Fire Accident: అనంతపురం గోడౌన్ లో భారీ అగ్నిప్రమాదం ..రూ.2కోట్లకుపైగా ఆస్తినష్టం..!

sharma somaraju

Vote: ఓటర్లకు బిగ్ అలర్ట్ .. ఓటు హక్కు నమోదునకు నేడే అఖరు రోజు

sharma somaraju

Lok Sabha Elections: అస్సాంలోని ఈ పెద్ద కుటుంబంలో 350 మంది ఓటర్లు ..ఆ కుటుంబ ఓట్ల కోసం అభ్యర్ధుల ప్రయత్నాలు

sharma somaraju