TRS MLA: ఆవేశంలో నోరు జారితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడిప్పుడే ఆ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అర్థమవుతోంది.నోటికొచ్చినట్లు మాట్లాడితే ఏమవుతుందో ఆయనకు జనాలే అర్థమయ్యేలా చెబుతున్నారు.దీంతో సదరు ఎమ్మెల్యే ఫోన్ ను స్విచాఫ్ చేసుకునే వరకూ పరిస్థితి వచ్చింది.
TRS MLA: అసలేం జరిగిందంటే?
వివరాల్లోకి వెళితే.. అచ్చంపేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఈమధ్య హుజూరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకొని చేసిన ప్రకటన ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది.ఈ ఎన్నికలపై ఒక ఛానెల్ డిబేట్ నిర్వహించినప్పుడు అందులో పాల్గొన్న బాలరాజు రాజేందర్ గెలిచే ప్రసక్తే లేదని ఆ డిబేట్ లో బల్లగుద్ది చెప్పారు.అంతటితో ఆగకుండా హుజూరాబాద్ ఉపఎన్నికలో బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆవేశంగా ప్రకటించారు.
TRS MLA: ఇప్పుడేమి జరుగుతున్నదంటే!
అయితే బాలరాజు అంచనాలు తలకిందులయ్యాయి హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్ మీద దాదాపు పాతిక వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.దీంతో కేసీఆర్,కేటీఆర్ లకే దిమ్మతిరిగింది.అదే సమయంలో బాలరాజుకు కష్టాలు మొదలయ్యాయి.ఈ ఉప ఎన్నికలో రాజేందర్ గెలిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న బాలరాజు సవాల్ ను గుర్తు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగులు వెల్లువెత్తుతున్నాయి. గువ్వల బాలరాజు ఎక్కడంటూ,ఎప్పుడు రాజీనామా చేస్తారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సూటిగా ప్రశ్నిస్తున్నారు మీమ్స్ తో ఉతికి ఆరేస్తున్నారు. కొందరైతే నేరుగా ఈ విషయం అడగడానికి ఆయన మొబైల్ ఫోన్లు చేయటం ప్రారంభించారు.ఈ బాధ పడలేక గువ్వల బాలరాజు తన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు.ఇంట్లోనే ఉండి లేడని చెప్పిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
గతంలో బండ్ల గణేష్ కూ ఇదే గతి
సినీ నిర్మాతగా ఉంటూ కాంగ్రెస్ లో చేరి రాజకీయ ఆరంగేట్రం చేసిన బండ్ల గణేష్ గతంలో ఇదే పరిస్థితి ఎదుర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గనుక తెలంగాణాలో అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటానని ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు.అంత అంతేగాక తనకు కాంగ్రెస్ టిక్కెట్ లభించి గెలిచి ఎమ్మెల్యే అయినట్లు ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఒక వీడియో కూడా విడుదల చేశారు.ఆ రెండు జరగకపోవడంతో బండ్ల గణేష్ ను నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. ఇప్పుడు గువ్వల బాలరాజు వంతు వచ్చింది.