ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీన సీబీఐ అధికారులు కవితను విచారించనున్నారు. హైదరాబాద్ లేదా ఢిల్లీలో ఎక్కడైనా విచారణకు హజరుకావాలని సీబీఐ అధికారులు ఆమెను కోరారు. 160 సీఆర్పీసీ నోటీసులు వచ్చిన విషయాన్ని ఆమె దృవీకరించారు. ఈ నేపథ్యంలో శనివారం కవిత ప్రగతి భవన్ కు వెళ్లి తన తండ్రి, ముఖ్యమంత్రి కేసిఆర్ తో భేటీ అయ్యారు. సీబీఐ నోటీసులపై న్యాయపరంగా, రాజకీయ పరంగా ఎం చేయాలి, ఎలా ముందుకు వెల్లాలి అనే అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తొంది.
మరో పక్క ఈ అంశంపై కవిత ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తొంది. కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు అందడంపై టీఆర్ఎస్ కీలక నేతలు ఇంత వరకూ మాట్లాడలేదు. అయితే పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు మాత్రం కవితన కలిసి మద్దతు తెలియజేశారు. టీఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక బీజేపీ చేస్తున్న కుట్రగా ఆ పాార్టీ నేతలు విమర్శిస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ వ్యాపారి అమిత్ అరోరా అరెస్టు చేసిన తర్వాత రిమాండ్ రిపోర్టులో ఈడీ కవిత పేరును ప్రస్తావించడం, ఆ తర్వాత రెండు రోజులకే సీబీఐ ఆమెకు నోటీసులు జాారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?