దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలవడంతో టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్త పడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ గెలవగా దుబ్బాకలో కమలం పార్టీ గెలవడానికి కారణం ఎన్నికలను చాలా సులువుగా తీసుకోవటమే అనే తప్పును టిఆర్ఎస్ తెలుసుకుంది. నిజంగా దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీకి చెందిన కీలక నాయకులు సీఎం కేసీఆర్ పర్యటించి ఉంటే ఫలితం మరోలా ఉండేదని టిఆర్ఎస్ శ్రేణులు ఫలితాలు వచ్చాక విశ్లేషించాయి.
ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికలలో కూడా విజయబావుటా ఎగురవేయాలని దూకుడు మీద ఉన్న బిజెపి.. రక రకాల వ్యూహాలతో దూసుకుపోతుంది. మరో పక్క టిఆర్ఎస్ పార్టీ నాయకులను టెన్షన్ పెట్టిస్తున్నారు అసంతృప్తి నేతలు. టికెట్ వచ్చే పరిస్థితి కనబడకపోతే టిఆర్ఎస్ లో ఉన్న నాయకులు చాలావరకు కమలం పార్టీ వైపు చూస్తున్నారు.
దీంతో వారిని నచ్చజెప్పడానికి పార్టీకి చెందిన కీలక నాయకులు రంగంలోకి దిగి వలసిన పరిస్థితి ఏర్పడుతోంది. ఒకవైపు గ్రేటర్ ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఏ విధంగా ప్రచారం చేయాలి ? ఎలా ఓట్లను రాబట్టాలి అనే దాని విషయంలో పార్టీ శ్రేణులు ఆలోచిస్తుంటే మరో పక్క అసంతృప్తులు మాత్రం పార్టీకి చెందిన నాయకులను నిద్రపోవడం లేదు. తాజాగా టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కిలారి మనోహర్ రామచంద్రాపురం కార్పొరేటర్ అంజయ్య యాదవ్లు బీజేపీలో చేరారు. టిఆర్ఎస్ నుంచి టికెట్ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. అంజయ్య యాదవ్ కు నచ్చ జెప్పి మళ్లీ సొంత గూటికి లాక్కొచ్చారు. ఇలాంటి నాయకులు చాలామంది తయారవుతున్నారు. దీంతో గ్రేటర్ ఎన్నికలలో పరిణామాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెల్లారితే ఏ నాయకుడు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.