అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఉండే నోటు దుండుకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతను చేసే చేష్టలు మాట్లాడే మాటలు విని అసలు ఇతను అగ్రరాజ్యం అధ్యక్షుడు ఎలా అయ్యాడని తెలియక తల బాదుకుంటూ ఉంటారు. ప్రవాస భారతీయులను అయితే ఒక రేంజ్ లో హింసించి పడేశాడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా అధ్యక్షుడి రేసులో నిలిచాడు…
మనతో పాటు వారినీ….
భారత్ పై డోనాల్డ్ ట్రంప్ చేసిన తీవ్ర ఆరోపణలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కలకలం సృష్టిస్తున్నాయి. పర్యావరణ కాలుష్యానికి భారతదేశమే కారణమని ఆయన విమర్శించారు. వివరాల్లోకి వెళితే మరికొద్దిరోజుల్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించడంలో రాష్ట్రాలలో ఒకటైన నార్త్ కరోలినా లో గురువారం ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వాతావరణ కాలుష్యం విషయమై మాట్లాడిన ఆయన భారత్ తో పాటుగా చైనా రష్యా దేశాలను కూడా నిందించాడు.
అది మురికి దేశం….
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ కాలుష్యానికి భారత్-చైనా దేశాల కారణం ఈ మూడు దేశాలు కాలుష్య కారకాలని…. తీవ్రస్థాయిలో అవి ప్రమాదకర వాయువులని గాలిలోకి విడుదల చేస్తున్నాయని ఆరోపించారు. దీంతో పర్యావరణం పూర్తిగా దెబ్బతింటుంది అంటూ విమర్శించారు. పర్యావరణ పరిరక్షణ కి ఎప్పుడూ అమెరికా కట్టుబడి ఉంటుందని…. అందుకు అవసరమైన చర్యలను కూడా తాము తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. నేను నీకు ఎప్పటి నుండో చెబుతూనే ఉంటాను నాకు స్వచ్ఛమైనగాలి అంటే ఇష్టం.. కానీ రష్యా, చైనా, భారత్ వంటి దేశాలు వాతావరణాన్ని కలుషితం చేస్తూ ఉంటాయి…. అవి చాలా మురికి ప్రదేశాలు అన్నట్లు చెప్పడంతో ఒకసారి అందరూ నిర్ఘాంతపోయారు.
ఇదేమి తొలిసారి కాదు..!
ఇక ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా భారత్ పైన ఇవే ఆరోపణలు చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా గతనెల 29న ఒక డిబేట్ లో పాల్గొన్నప్పుడు వాతావరణ కాలుష్యానికి ఈ మూడు దేశాలే కారణమని అన్నారు. ఇక ఈ సారి ప్లాస్టిక్ బదులుగా ఆయన పేపర్ వాడుకని ఎద్దేవా వేయడం గమనార్హం.
మొత్తానికి ఈ మాటలతో అమెరికాలో ప్రవాస భారతీయుల ఓట్లను ట్రంప్ కోల్పోయాడు అని చెప్పాలి. అంతే కాకుండా అతనికి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఇప్పటికే వచ్చి ఉంది. కరోనా నియంత్రణ విషయంలో అతను పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. వ్యక్తిగత కారణాలు కూడా అతనికి వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి దాదాపుగా అతని ఓటమి ఖాయం అని అంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు