నేటికాలం లో చాలామంది వారానికి ఓ సారైనా బిర్యానీ.. టేస్ట్ చేస్తారు. బిర్యానీపార్టీలు, ఫంక్షన్స్.. ఇంట్లో అకేషన్స్ ఇలా ఏదైనా బిర్యానీ ఉండాల్సిందే. శాకాహారులు వెజ్ బిర్యానీ,పన్నీర్ బిర్యానీ, పు లావ్, మష్రూమ్ బిర్యానీ.. మాంసాహారులు చికెన్, మటన్, ప్రాన్స్ ఇలా చెప్పుకుంటూ పోతేఒక పెద్ద లిస్ట్ వస్తుంది. ఇప్పుడైతే చాలామంది బిర్యానీ తో పాటుగా లేదా.. తిన్న తర్వాత వెంటనే కూల్డ్రింక్స్ తాగుతున్నారు. కానీ.. ఇదివరకు కాలం లో అయితే ఓ అలవాటు ఉండేది. అదే టీ తాగడం ఇంకా చెప్పాలంటే ఇప్పటికీ చాలామంది బిర్యానీ తిన్న వెంటనే టీ తాగుతారు.
ఇరానీ టీ అందుబాటులో ఉన్నవారు..దాన్ని సిప్ చేస్తారు. బిర్యానీ తిన్నాకా టీ ఎందుకంటే దాని వెనుక ఓ పెద్ద కథే ఉంది.. బిర్యానీని ఎక్కువగా నూనె , నెయ్యి, డాల్డా వేసి తయారు చేస్తారు. అది తిన్నప్పుడు ఆహారనాళం లో జిడ్డు ఉండిపోతుంది . తిన్నవెంటనే టీ తాగడం వల్ల ఆ జిడ్డు కరిగిపోతుందని బిర్యానీ తినగానే టీ తాగే వారు. ఇదే కారణం తో అప్పట్లోనే బిర్యానీ బయట, ఆర్డర్ చేసినవారికి టీ ఉచితం గా ఇచ్చేవారని కొంతమంది చెబుతారు.
అది టీ కోసం ప్రమోషన్గా వాడేసుకునేవారట. అందుకే.. ఇప్పటికీ.. చాలామంది అలానే బిర్యానీ తినగానే టీ తాగుతుంటారు.ఆలా అన్నారు కదా అని మీరూ గ్లాసులు గ్లాసుల టీ తాగేయొద్దు.. అలా చేయడం వలన మొదటికే మోసం వస్తుంది. ఇంకొంతమంది లెమన్ టీ ఇష్టపడతారు లెమన్ టీ శరీరంలోకి ప్రవేశించగానే మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచి, జీవక్రియలను చురుగ్గా పనిచేయడానికి సహాయపడుతుంది. కాబట్టి చాలామంది బిర్యానీ తిన్నాక లెమన్ టీ ని తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు.
మరి కొందరు అల్లం టీ తాగితే మజా వస్తుంది అంటున్నారు. బిర్యానీ తిన్న తరవాత ఒక కప్పు అల్లం టీ తాగడం వలన అది కడుపులోకి వెళ్లి ఆహారాన్ని ఇట్టే అరిగించేస్తుంది కాబట్టి మనం తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది..ఇలా ఎవ్వరికి నచ్చిన బిర్యానీ వాళ్ళు తింటూ తిన్న తర్వాత నచ్చిన టీ తాగి మజా పొందుతున్నారు. చల్లని పానీయాలకన్నా వేడి ,వేడి టీ మంచిదంటున్నారు ఇంకొందరు.