ఎదుటివారు మనల్ని చూడగానే ఆకట్టుకునేది,ఆకర్షించే ది నవ్వు.. పలు వరుస తెల్లగా అందం గా ఉంటే నవ్వు ఇంకా అద్భుతం గా ఉంటుంది. ఇటీవల కాలం లో దంతాల సమస్య లు ముఖ్యంగా చిగుళ్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇవి రావటానికి కొన్ని ఆహారాలు కూడా కారణం గా చెప్పవచ్చు. అంతే కాకుండా దంతాల మీద ఎక్కువగా గార పట్టడం, పాచి పట్టటం వంటి సమస్య లు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ సమస్యలు లేకుండా దంతాలు తెల్లగా మెరిసిపోవాలంటే తీసుకోవాలిసిన ఆహారాలను తెలుసుకుందాం.
అరటిపండు తొక్క ని తీసుకొని పళ్ళ మీద ఒక నిమిషం పాటు రుద్దితే అరటి తొక్క లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ మలినాలను పోగొట్టి పళ్ళు తెల్లగా చేయడానికి ఉపయోగపడతాయి. అదే విధం గా నిమ్మతొక్కని వంటసోడాకి అద్ది పళ్ళ మీద రాయడం వల్ల కూడా పళ్ళు మెరుస్తాయి. తాజా క్యారెట్ లని కొరికి నమిలి తింటే దంతాల మీద బ్యాక్టీరియా పోయి తెల్లగామారడం తో పాటు చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
పళ్లు అందంగా ఉండాలంటే వేటికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం..
టీ,కాఫీ, లు ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు పసుపురంగు లోకి వస్తాయి. అదేవిధంగా పొగాకు నమలడం , మద్యం, సిగరెట్లు దంతా లను పాడై యేలా చేస్తాయి. ఉల్లిపాయ తింటే నోరు వాసన వస్తుందని చాలా మంది పచ్చి ఉల్లిపాయ ను తినటానికి ఇష్టపడరు. అయితే ఉల్లిపాయ లో ఉండే సల్పర్ నోటి సమస్యలను దూరం చేయడం తో పాటు దంతాలను తెల్లగా మారుస్తుంది.
దంతాల చిగుళ్ళను బలంగా ఉంచి దంతాలను తెల్లగా చేసే పోషకాలు ఆపిల్ లో పుష్కలం గా ఉన్నాయి. అంతేకాక నోటిలో చెడు బ్యాక్టీరియా నశించి పోతుంది. దాంతో దంతాల సమస్య లు తగ్గుతాయి.