wealth: పారిశుద్ధ్యా నికి
గురుభక్తి కలిగినవారు,దేవతలను,పితృదేవతలను కూడా పూజించేవారు, సత్యం మాట్లాడేవారు, దాన ధర్మాలు చేయడానికి సంకోచించని వారు, భార్యను గౌరవ భావం తో చూసేవారు,బ్రాహ్మణుల మీద భక్తి చూపేవారు,పగటి వేళా నిద్రకు దూరం గా ఉండేవారు, వృద్ధుల కు బలహీనులకు నిస్సహాయులైన స్త్రీలకు, పేదవారి పట్ల కరుణ తో ఉండేవారు, పారిశుద్ధ్యా నికి విలువిచ్చేవారు, అతిథులకు పెట్టిన తర్వాత మాత్రమే భోజనం (food) చేసేవారంటే శ్రీ మహాలక్ష్మి కి అత్యంత ఇష్టులు అవుతారు అనడం లో ఎలాంటి సందేహము లేదు. ఇలాంటి వారి ఇళ్లలోనే శ్రీ మహా లక్ష్మి ఎల్లప్పుడూ స్థిర నివాసం ఉంటుంది.
wealth: పరిపూర్ణమైన సౌభాగ్యాన్ని
అబద్దాలు చెప్పే వారు దగ్గర, ఇతరుల మనస్సును నోచుకునేలా చేసేవారి దగ్గర లక్ష్మీదేవి నిముషం కూడా నిలవదు. ఇంకా ఇంట్లో వెంట్రుకలు గాలికి తిరగాడితే లక్ష్మీ కటాక్షం అనేది అస్సలు కలుగదు. బయట తిరిగి వచ్చి కాళ్ళను కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చే వాళ్ల ఇంట లక్ష్మీదేవి అస్సలు ఉండలేదు. తల్లిదండ్రుల మాట వినకుండా లెక్కచేయని వారు, గోళ్లు కొరికే వారింట్లో ఆ మహా లక్ష్మి నివాసం ఉండదని మన శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. లక్ష్మీ అమ్మవారు అన్ని సిరి సంపదలు ఇవ్వడం తో పాటు పరిపూర్ణమైన సౌభాగ్యాన్ని కూడా ఇచ్చే దయగల తల్లి . అందుకే సౌభాగ్యవంతులు అనబడే ప్రతి ఒక్కరు శ్రావణమాసం లో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు.
శుక్రుడికి ప్రత్యాధి దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి.
శుక్రుడు
మనుషులకు కళలు రావాలన్న , బోగభాగ్యాలు అనుభవించాలి అన్న, ఆరోగ్యవంతం గా ఉండాలన్న ,వాహన యోగంపొందటానికి, మంచి ఇల్లు, మంచి ఆహారం, చక్కని కళత్రం, అందం ఇవన్నీ ప్రసాదించేది శుక్రుడే అని తెలుసుకోవాలి. శుక్రుడు భాగ్యకారకుడు గా చెప్పబడతాడు.కాబట్టి ఎవరైనా శుక్రుడి అను గ్రహం పొందాలంటే శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించి తమ కోర్కెలు ఫలించేలా చేసుకోవచ్చు.