తెలంగాణ లో కరోనా విపరీతంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వం సరిగా చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం అంతే సమర్ధవంతంగా తిప్పికొడుతుంది. ఈ మేరకు కొన్ని కేసులు కూడా కోర్టు వరకేజ్ వెళ్లాయి. తాజాగా తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీష్ రావుకి కరోనా నిర్ధారణ జరిగింది. రెండు రోజులుగా లక్షణాలతో బాధపడుతున్న ఆయన ఈరోజు పరీక్ష చేయించుకుంటే పాజిటివ్ గా తేలింది. వెంటనే ఆయన ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతానికి చిన్నపాటి జలుబు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. లక్షణాలు ఏమి లేవని, వారం రోజుల్లో తిరిగి అందుబాటులో ఉంటానని ఆయన తన సన్నిహితులకు చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణలో 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులకు కరోనా సోకి నయమైన సంగతి తెలిసిందే.
previous post