హైదరాబాద్: ఆర్టిసి సమ్మె కొనసాగుతోందని జెఎసి కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి తెలిపారు. ఆర్టిసి ప్రైవేటీకరణ సాధ్యం కాదనీ, కార్మికులు ఎవరూ భయపడవద్దనీ ఆయన పేర్కొన్నారు. ప్రైవేటీకరణ చట్టంలో లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేడు నిర్వహిస్తున్న సమీక్షలో మంచి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని అన్నారు. ఆర్టిసి జెఎసి జారీ చేసిన ప్రకటనను ఎండికి పంపించామని తెలిపారు.
రేపు ప్రొఫెసర్ జయశంకర్ చిత్ర పటాలకు నివాళులర్పించి అన్ని డిపోల వద్ద నిరసన కార్యక్రమాలు చేట్టాలని పిలుపునిచ్చారు. ఎంజిబిఎస్లో మహిళా ఉద్యోగులు ఉదయం నుండి నిరసన కార్యక్రమాలు చేపడతారని తెలిపారు. రేపు భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామని అశ్వత్థామరెడ్డి తెలియజేశారు.