కరోనా సంక్షోభం వల్ల మొత్తం ప్రపంచ ఆర్థిక పరిస్థితి అతలాకుతలం అయిపోయింది. ఇకపోతే ఈ మహమ్మారి వైరస్ ప్రభావం భారత్ లోనే అత్యంత సంపన్నమైన గుడి అయిన తిరుమల లోని వెంకటేశ్వర స్వామి ఆలయం పై చూపించింది కూడా పడింది. గత నాలుగు నెలలుగా గా తిరుమల శ్రీవారి గుడిని పరిరక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) ఆర్థిక పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది. మొత్తం మీద 90 లక్షల భక్తులు తిరుమలకు రాకుండా ఆగిపోవడంతో మరియు శ్రీవారిని దర్శించుకునేందుకు అతి కొద్దిమందే రిస్క్ చేసి వస్తుండడంతో వారి ఆదాయం పూర్తిగా పడిపోయింది.
ఈ లాక్ డౌన్ లోడ్ నుండి సడలింపులు ఇచ్చిన తర్వాత దాదాపు రూ.1,100 కోట్ల ఆదాయం వస్తుండని టీటీడి అంచనా వేయగా కేవలం 250 కోట్లు మాత్రమే ఆయాయం వచ్చింది. అంటే దాదాపు వారి ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడినట్లే. ఇక 270కోట్ల లో కూడా 240 కోట్ల రూపాయలు వారికి మామూలుగా వచ్చే ఆదాయం కాదు.. అవి అంతా టిటిడి వేర్వేరు బ్యాంకుల్లో చేసిన డిపాజిట్ల నుండి వడ్డీ రూపంలో వచ్చిన మొత్తం.
కాబట్టి భక్తుల నుండి కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇక భక్తుల రాక తగ్గిపోవడంతో లడ్డూల నుండి వచ్చే ఆదాయం కూడా వారికి పూర్తిగా పడిపోయింది. గత నాలుగు నెలల్లో టిటిడి కేవలం రూ.3.5 కోట్ల విలువచేసే లడ్డూలను మాత్రమే అమ్మగలిగింది ఇదే పరిస్థితి కొనసాగితే తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వస్తుందని మరియు ఇప్పటికే సిబ్బంది లోని వేతనాల్లో కోత విధించేందుకు టీటీడి యాజమాన్యం చూస్తున్నారని తెలుస్తోంది.