(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కార్యనిర్వహణ అధికారి (ఇఓ) అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్చార్జి ఇఓగా ధర్మారెడ్డిని నియమించింది. అనిల్ కుమార్ సింఘాల్ను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వ కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2017 మే 1న అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీ ఇఓగా నియమితులైయ్యారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత కూడా ఆయన ఈ కీలక పోస్టులో కొనసాగారు.