దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఏపీలో కూడా కరోనా తీవ్రత ఎక్కవగా ఉంది. వేలల్లో కసులు నమోదవుతున్నాయి. ఈ ఎఫెక్ట్ ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలనూ వదలడం లేదు. కొండపై కరోనా తీవ్రత ధాటకి ఏకంగా 748 మంది కరోనా బారినపడినట్టు టీటీడీ అధికారికంగా ప్రకటించింది. వీరిలో అర్చకులు ఉద్యోగులు, వాయిద్యకారులు, కళాకారులతోపాటు వివిధ విభాగాల్లో పని చేసే సిబ్బంది ఉన్నారు. వీరిలో ఒక అర్చకుడు ఇద్దరు ఉద్యోగులు మరణించారు కూడా. మిగిలిన వారిలో కొందరు కోలుకున్నారు. మిగిలిన వారు ఇంకా చికిత్స తీసుకుంటున్నారు. మరి ఈ అంశంపై టీటీడీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
శ్రీవారి ఆలయంలో విధులంటే భయపడుతున్నారు..
టీటీడీలో శాస్వత ఉద్యోగులు దాదాపు 7500 మంది ఉన్నట్టు సమాచారం. వీరిలో దాదాపు 80 మంది మాత్రమే శ్రీవారి ఆలయంలో పని చేస్తారు. అనేక సిఫార్సులు, పైరవీలు చేసి శ్రీవారి ఆలయంలో పనిచేసే అవకాశం గతంలో చేసేవారు. ఇప్పుడు శ్రీవారి ఆలయంలో పని అంటేనే వణికిపోతున్నారు. రెండు, మూడు మాస్కులు వేసుకుని పని చేయడం.. అనారోగ్యం, సెలవుల పేరుతో అక్కడ పని తప్పించుకోవడం చేస్తున్నారు. భక్తులకు కరోనా సోకలేదు.. భక్తుల నుంచి సిబ్బందికి కరోనా సోకలేదని టీటీడీ తెలిపింది. వారు కుటుంబం, బయట పరిస్థితుల్లోనే వీరికి కరోనా సోకిందని భావిస్తున్నారు. కైంకర్యాలు పర్యవేక్షకులు, అర్చకులు కరోనా బారిన పడడంతో కలకలం రేగుతోంది.
మరోవైపు ఇదే విషయమై రమణ దీక్షితులు ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్లు కూడా చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో అర్చకుల సమస్యలు పట్టించుకోవాలని కోరారు. వారు కరోనా బారిన పడుతున్నారని కూడా తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో దర్శనాలు నిలిపి వేయాలని కూడా రమణ దీక్షితులు ఓసారి అన్నారు. దీంతో.. రమణ దీక్షితులు ట్వీట్ కు తిరుమలలో ప్రస్తుత కోవిడ్ తీవ్రతకు, పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్నాళ్లు విధులకు దూరంగా ఉండటమే బెటర్ అంటూ కొందరు భావిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో పని చేసేందుకు గతంలో వచ్చిన సిఫార్సులు ఇప్పుడు లేవని కూడా అంటున్నారు. మరోవైపు అర్చకులు, ఉద్యోగుల విషయంలో, వారి భద్రత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?