Dollar Seshadri: తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయ ఓ.ఎస్.డి డాలర్ శేషాద్రి గుండెపోటుతో మృతి చెందారు. కార్తీకమాసం నేపథ్యంలో విశాఖపట్నంలో కార్తీక దీపోత్సవం లో పాల్గొనడానికి వెళ్లిన డాలర్ శేషాద్రి.. గుండెపోటు కారణంగా మృతి చెందడం జరిగింది. 1978 నుండి శ్రీవారి సేవలో ఉన్న…ఆయన..2007లో రిటైర్ కావడం జరిగింది. అయినా కానీ శేషాద్రి ఓఎస్డీ తప్పనిసరి కావడంతో.. అప్పటినుండి టీటీడీలో కొనసాగుతూనే ఉన్నారు.
కాగా విశాఖలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాసం నేపథ్యంలో కోటి దీపాల ఉత్సవం.. జరుగుతోంది ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన డాలర్ శేషాద్రి ఉదయం నాలుగు గంటల 40 నిమిషాలకు గుండెపోటు రావడంతో మరణించటంతో ఒక్కసారిగా టీటీడీ.. సభ్యులు షాక్ కి గురయ్యారు. డాలర్ శేషాద్రి మృతి తెలుసుకుని ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.