లాక్ డౌన్ నుండి మినహాయింపులు ఇచ్చిన్నప్పటినుండి కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే అన్ లాక్ ప్రక్రియలో భాగంగా దేవస్థానాలు, మసీదులు మరియు ప్రార్థనా మందిరాలను తెరచిన నేపథ్యంలో ఇన్ని రోజులు దేవుడి దర్శనానికి దూరమైన భక్తులంతా ఆయా మందిరాలకు వెళ్లి వైరస్ బారిన పడుతున్నారు.
ఇకపోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో గతంలోనే పలువురు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అది ఇప్పుడు తాజాగా 8 మంది పూజారులలకి ఈ వైరస్ సోకడం ఏడుకొండల లో పెద్ద కలకలం రేపింది.
పూజారులకు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు వల్ల వైరస్ సోకిందా లేకపోతే వారికి పాజిటివ్ ఎలా వచ్చ్ంది ఈ విషయంపై అధికారులు మరియు వైద్య నిపుణులు పరిశీలిస్తున్నారు. ఏదైనా కొద్ది రోజులు రద్దీగా ఉండే ప్రదేశాలలకు మరియు ఇటువంటి కూడికలు ఉండే చోట్లకు వెళ్లకపోవడం మంచిదదని అధికారులు సలహా ఇస్తున్నారు.