శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానెల్ (ఎస్వీబిసి) తిరుమల తిరుపతి దేవస్థానం సొంత ఛానెల్. నిత్యం ఆధ్యాత్మిక విశేషాలు, స్వామి వారి సేవలను అందించే ఛానెల్. తమిళ్, కన్నడ భాషల్లోనూ నడిచే ఈ ఛానెల్ అంటే దాదాపు స్వామి వారి సేవలను అందిస్తూ, హిందూ ధర్మ ప్రచారానికి ఉపయోగపడేలా ఉండాలి. దీన్ని నిత్యం 12 లక్షల మంది నిత్యం ఫాలో అయితే బ్రహ్మ్తత్సవాల సమయంలో అద్భుతమైన టిఆర్పి సాధిస్తోంది. ఒక చైర్మన్ తో సహా, 300 మంది వరకు ఉద్యోగులున్న ఈ సంస్థ నిత్యం టీటీడీ కు తలనొప్పిలా మారింది. అసలు పని చేయకుండా కొసరు పనులు చేస్తూ సిబ్బంది జుగుప్స కరమైన పనులు చేస్తూ భక్తుల మనోభావాలనే దెబ్బ తీస్తున్నారు. తాజాగా ఎస్వీబిసి సిబ్బంది ఓ భక్తుడు ఈ మెయిల్ ద్వారా అడిగిన సమాచారానికి, బదులుగా పోర్న్ లింక్ సైట్ పంపడం వివాదం అవుతోంది. భక్తుడు నేరుగా టీటీడీ పెద్దలకు దీనిపై ఫిర్యాదు చేయడం, వెనువెంటనే రహస్య విచారణ చేస్తే దానిలో లింక్ పంపిన ఉద్యోగితో పాటు మరో 5 మంది ఉద్యోగులు ఆఫీసులోనే పోర్న్ చూస్తున్నట్లు విచారణలో తేలింది. దింతో దీనిపై మరింత లోతుగా విచారణ చేసేందుకు, సిస్టమ్స్ పై నిఘాతో పాటు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు టీటీడీ అధికారులు అలోచిస్తున్నారు.
నిత్యం వివాదాల సుడిగుండం
ఎస్వీబిసి ఎప్పుడు ఆధ్యాత్మిక వాతావరణంతోఎం ఆహ్లాదం గ నిలిచిపోయే అవకాశం ఉన్నాకొందరు ఛానెల్నుబ్రష్టు పట్టిస్తున్నారు. ఎస్వీబీసీలో అధికారులు, సిబ్బంది అంత ఎవరికీ వారు తీరిపోని విధంగా ఛానెల్ ప్రతిష్టను దెబ్బతిస్తున్నారు.
* ఎస్వీబిసి చైర్మన్ హోదాలో పృద్విరాజ్ ఒక మహిళతో జరిపిన సంభాషణ తీవ్ర వివాదం అయ్యింది. దీనికి అయన ఛైర్మెన్ పదవిని పోగుట్టుకున్నారు.
* రెండేళ్ల క్రితం ఛానెల్ సీఈఓ మహిళా ఉద్యోగులతో సరైన రీతిలో మాట్లాడటం లేదని, వారికీ నచ్చిన వారికీ నచ్చిన ప్రదేశంలో మిగిలిన వారిని పని ఎక్కువ ఉండే పనుల్లో వేస్తున్నారని, ఆయన మహిళలతో వాడే బాషా అభ్యన్తకరంగా ఉంటుంది అని ఉద్యోగులు అధికారులకు ఫిర్యాదు చేసారు.
* ఉద్యోగుల్లో కొందరు అవుట్ సోర్సింగ్ మహిళా లైంగికంగా వేధిస్తున్నారని, తమకు అనుకూలంగా ఉండకపోతే అధికారులకు చెప్పి ఉద్యోగాలు తీయిస్తామని బెదిరిస్తున్నారని అంత కలిపి కార్మిక నాయకులకు చెప్పడం, అది సరిజేయడానికి పెద్ద లోబీయింగ్ జరగటం 2018 లో దుమారం రేపింది .
* ఎస్వీబీసీలో ఉద్యోగుల్లో వర్గాలుగా తయారై ఒక్కొక్కరిని ఒక్కొక్కర్ని ట్రాప్ చేసుకుని ఫిర్యాదులు చేస్కోవడం, అది జేఈఓ వరకు వెళ్ళింది.
ఆజమాయిషీ ఎక్కడ ?
ఎస్వీబిసి ఉద్యోగుల్లో చాలామందిని కేవలం సిఫార్సుల ద్వారా తీసుకుంటున్నారు. ఛానెల్ విషయంలో పెద్దగా పనులు ఉండవు. పరిమితికి మించి సిబ్బంది కార్యాలయంలో కనిపిస్తారు. వారికీ ఎలాంటి పనులు ఉండవు. మహిళలు, పురుషులు ఉన్న చనువు వాళ్ళ వారు అతి ప్రవర్తన కనిపిస్తుంది. ఇక ఎవరికీ కాస్త కష్టం పని అప్పగించిన దాని నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుకుతారు. ముఖ్యంగా ఛానెల్ సిబ్బందిపై అధికారులకు పర్యవేక్షణ లేదు. వస్తున్నా అధికారులు సైతం అవినీతిలో, అక్రమాల్లో కురుకుపోతున్నవారే. ఉద్యోగుల నియామకానికి ఒక నిర్దుష్ట ఎంపిక లేదు. వారికీ నిర్దిష్ట పని ఉండదు. ఒకరు చేయాల్సిన పని ముగ్గురు చేస్తారు. టీటీడీ కు ఏటా యాడ్లరూపేణా రెవెన్యూ ఇవ్వాల్సిన ఛానెల్ టీటీడీ నుంచి వార్షిక బడ్జెట్ లో కేటాయింపులు చేస్తున్న దాన్ని పట్టించుకు నాధుడే కరవు. ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాల్సిన అధికారులు, టీటీడీ పెద్దలే ఎస్వీబీసీను గాలికి వదిలేయడంతో అక్కడి సిబ్బంది ఆడిందే ఆటగా సాగుతోంది.