తిరుమల లో శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా అక్టోబరు 11 వ తేదీ (రేపు, సోమవారం) నుండి 15వ తేదీ వరకు అయిదు రోజుల పాటు హైదరాబాద్ ఎన్టిఆర్ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. ఉత్సావల్లో భాగంగా అక్టోబరు 11న (సోమవారం) వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరుగనున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్, పరిసర ప్రాంత శ్రీవారి భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీవారి కృపకు పాతృలు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ఉత్సవాలకు గానూ ఏర్పాట్లు పూర్తి అయినట్లు వివరించారు.
స్టేడియంలో ఏర్పాట్లను ఆదివారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ఉదయం 6 గంటల నుండ రాత్రి 10 గంటల వరకూ అయిదు రోజుల పాటు వైభవోత్సవాలు జరుగుతాయని చెప్పారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా భక్తులు స్వామివారి ఉత్సవాలకు తిరుమల రాలేకపోయారనీ, అలాంటి వారు స్వామి వారి సేవలో పాల్గొనేందుకు ఈ వైభవోత్సవాలు దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డిసెంబరులో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీ లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తామని ఈఓ తెలిపారు. పవిత్రమైన కార్తీక మాసంలో గత ఏడాది తరహాలోనే విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని ఈఓ ధర్మారెడ్డి తెలియజేశారు.
ఏపి మంత్రి విడతల రజినికి తృటిలో తప్పిన ప్రమాదం .. కారు ముందు భాగం ధ్వంసం