Tulasi: నేటి మన ఆహారపు అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది..మనం బయట దొరికే చిరుతిళ్లు తింటూ వ్యాయామం చేయకపోవడం వల్ల, ఎక్కువ సేపు కూర్చొని ఉండటం, ఒత్తిడి వంటి కారణాలతో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువు పెరగడం సులువే కానీ తగ్గడం మాత్రం కాస్తా సమయం వెచ్చించాల్సి వస్తుంది.. శరీరంలో ఉన్న కొవ్వుని కరిగించాలంటే తులసి తో పాటు ఈ పదార్థాలను కలిపి తీసుకుంటే చాలు..!
ఈ చిట్కా కోసం ముందుగా పది తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్ లో వేసుకోవాలి. అందులో అర చెంచా వాము, నాలుగు మిరియాలు వేసి మెత్తగా పేస్టులాగా చేసి పక్కన పెట్టుకోవాలి.. ఇప్పుడు పోయి వెలిగించి దానిపైన ఒక గిన్నె పెట్టి ఓ గ్లాసు నీటిని పోయాలి.. ఈ డి టీవీ బాగా మరిగించాలి ఇందులో ముందుగా సిద్ధం చేసుకున్న తులసి ఆకుల పేస్టు వేసి బాగా మరిగించాలి ఆ తర్వాత ఈ నీటిని వడపోసుకోవాలి..
ఇలా తయారు చేసుకున్న ఈ నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి. ఈ నీటిని తాగటం వల్ల శరీరంలో పేర్కొన్న విష వ్యర్ధాలు బయటకు పోతాయి.. అలాగే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోయి అధిక బరువు సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.. ఇంకా ఈ టీ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.. టెన్షన్, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యలను నయం చేస్తుంది.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలను రాకుండా కాపాడుతుంది..