కర్నూలు: కర్ణాటకలోని ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో డ్యాం 33 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 1,55,431 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో సైతం 1,55,431 క్యూసెక్కులు ఉండగా, అదే స్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద పోటు పెరిగితే రెండు లక్షల క్యూసెక్కులు విడుదల చేసే అవకాశం ఉంది. తుంగభద్ర డ్యాం మొత్తం గేట్లు ఎత్తడం 2019 సంవత్సరంలో ఇది నాలుగో సారి. డ్యాంలో ప్రస్తుతం 100.663 టీఎంసీల నీటి నిల్వ ఉంది. మరోవైపు తుంగభద్ర డ్యాం నుంచి వరదను దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ శ్రీశైలానికి పరుగులు పెడుతోంది. కృష్ణ, తుంగభద్ర నదుల్లో నీటి ప్రవాహం పెరగడంతో శ్రీశైలం జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. మరోవైపు నదితీర ప్రాంత ప్రజలను నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
previous post
next post